తెలంగాణ

telangana

21 రోజుల తర్వాత 'పెట్రో' బాదుడుకు బ్రేక్​

By

Published : Jun 28, 2020, 7:52 AM IST

వాహనదారులకు కాస్త ఉపశనమనం లభించింది. పెట్రో ధరల పెంపునకు 21 రోజుల తర్వాత బ్రేక్​ ఇచ్చాయి చమురు సంస్థలు. శనివారం లీటర్​ పెట్రోల్​పై 25 పైసలు, డీజిల్​ పై 21 పైసలు పెంచగా.. ఆదివారం స్థిరంగా ఉంచాయి.

No increase in prices of petrol
21 రోజుల తర్వాత 'పెట్రో' బాదుడుకు బ్రేక్​

పెట్రోల్​, డీజిల్​ ధరల మోతకు బ్రేక్​ పడింది. వరుసగా 21 రోజులుగా ధరలు పెంచుతూ వస్తోన్న చమురు సంస్థలు కాస్త ఉపశమనం కల్పించాయి. ఆదివారం పెట్రో ధరలను స్థిరంగా ఉంచాయి.

శనివారం (జూన్​ 27న) దిల్లీలో లీటర్​ పెట్రోల్​పై 25 పైసలు, డీజిల్​పై 21 పైసలు పెంచిన చమురు సంస్థలు ఆదివారం ధరలు పెంచకుండా.. స్థిరంగా ఉంచాయి. ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోలు రూ. 80.38, లీటరు డీజిల్​ రూ. 80.40 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

నగరం

పెట్రోల్

(లీటరుకు రూ.లలో)

డీజిల్

(లీటరుకు రూ.లలో)

దిల్లీ 80.38 80.40 హైదరాబాద్ 83.41 78.55 బెంగళూరు 82.97 76.44 ముంబయి 87.12 78.69 చెన్నై 83.57 77.06 కోల్​కతా 82.03 75.51

ఇదీ చూడండి: 'పెట్రో బాదుడుతో నిండుకుండల్లా ప్రభుత్వ ఖజానాలు​'

ABOUT THE AUTHOR

...view details