తెలంగాణ

telangana

Gold Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా

By

Published : Sep 10, 2021, 9:39 AM IST

ఏపీ, తెలంగాణల్లో బంగారం ధర (Gold Rate Today) స్వల్పంగా పెరిగింది. వెండి ధర సైతం మరింత పుంజుకుంది. రెండు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి.

GOLD RATES
GOLD RATES

బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర దాదాపు రూ.60 వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో(Gold Price in Hyderabad) పది గ్రాముల పసిడి ధర రూ.60 పెరిగి రూ.48,580గా ఉంది. కేజీ వెండి ధర రూ.255 మేర పెరిగి రూ.65,695 పలుకుతోంది.
  • విజయవాడలో (Gold Price in Vijayawada) పది గ్రాముల పసిడి ధర 60 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం రూ.48,580‬ వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.255 మేర పుంజుకుని రూ.65,695 పలుకుతోంది.
  • విశాఖపట్నంలో(Gold Price in Vizag) పది గ్రాముల పసిడి ధర 60 రూపాయలు పెరిగి రూ.48,580‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.255 మేర వృద్ధిచెంది రూ.65,695 వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,798.65 డాలర్ల వద్ద ఉంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 24.18 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.7 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర 19 పైసలు తగ్గి రూ.97.2 వద్దకు చేరింది.

గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై 19 పైసలు తగ్గి రూ.98.43 వద్దకు చేరింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details