తెలంగాణ

telangana

ఈ మరుగుజ్జుల పెళ్లి అదుర్స్..​! వివాహ వీడియో సోషల్ మీడియాలో వైరల్..

By

Published : Jan 29, 2023, 12:41 PM IST

ఓ జంట వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఇందులో వధూవరులిద్దరూ మరుగుజ్జులు. ఈడు జోడున్న ఈ జంటను చూసిన వారంతా విషెస్ చెబుతున్నారు.

Marriage of dwarf couple in rajasthan
మరుగుజ్జు జంట వివాహం

మరుగుజ్జు జంట వివాహం

రాజస్థాన్​లో ఓ జంట వివాహం చేసుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో విశేషం ఏమిటంటే.. వధూవరులిద్దరూ మరుగుజ్జులు. ఈడూ జోడున్న ఈ జంటను చూసిన వారంతా వారికి అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ ​మీడియాలో పరిచయమైన ఈ జంట.. అనంతరం ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది.

జోధ్​పుర్​కు చెందిన సాక్షి అనే యువతికి రాజ్​ సమంద్​కు చెందిన రిషబ్​తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించి ఏడాది క్రితమే వాళ్లిద్దరికీ నిశ్చితార్థం జరిపించారు. గురువారం వారి వివాహం ఘనంగా జరిగింది. సాక్షి, రిషబ్​ జంట ఇన్​స్టాగ్రామ్​లో 'మినీ కపుల్'​ అనే ఐడీని క్రియేట్ చేసి వారి పెళ్లికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్​ను పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఆ జంటను చూసినవారంతా వారిద్దరికీ విషెస్ తెలుపుతున్నారు. సోషల్​ మీడియాలో ఈ జంట యాక్టివ్​గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ జీవితంలో జరిగే విషయాలను పంచుకుంటున్నారు. రిషబ్​కు ఇన్​స్టాగ్రామ్​లో 2,000 పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎంబీఏ చదివిన సాక్షి ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పాఠాలు భోదిస్తుంది. రిషబ్ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నాడు.

మరుగుజ్జు జంట వివాహం
మరుగుజ్జు జంట వివాహం

ఇంతకుముందు కూడా ఇలాంటి ఓ వివాహం నెట్టింట వైరల్​గా మారింది. పొట్టిగా ఉన్నందున తనకు పెళ్లి కావట్లేదని మరుగుజ్జు యువకుడు అజీమ్​ మసూరి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. యువతి దొరికినా కూడా 2019 నుంచి ఇంట్లో వాళ్లు తనకు పెళ్లి చేయట్లేదని పోలీస్ స్టేషన్​కు వెళ్లాడు. ఎట్టకేలకు పోలీసుల సహాయంతో పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details