తెలంగాణ

telangana

'ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా?'

By

Published : Jul 20, 2021, 1:22 PM IST

కరోనా ఆంక్షలను సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజల ప్రాణాలను ప్రభుత్వం పణంగా పెడుతోందని వ్యాఖ్యానించింది. ఈ కారణంగా కొవిడ్​ కేసులు పెరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

supreme court to kerala govt, కేరళ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు
'కేరళ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోంది'

బక్రీద్​ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో ఆంక్షలను సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ ఈ సడలింపులు చేయడం అనవసరమని వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం.. మహమ్మారికి ప్రజల ప్రాణాలు పణంగా పెడుతోందని పేర్కొంది. కేరళ ప్రభుత్వ సడలింపులపై దాఖలైన పిటిషన్​పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

'అదే జరిగితే చర్యలు తప్పవు'

వ్యాపారుల ఒత్తిడికి లొంగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారీమన్​, జస్టిస్​ బీఆర్​ గవాయ్​తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. జీవించే హక్కు గురించి పేర్కొంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్​ 21ను ప్రభుత్వం గమనించాలని సూచించింది. ఈ ఆంక్షల సడలింపు వైరస్​ వ్యాప్తిపై ప్రభావం చూపిస్తే.. దానిపై ఎవరైనా కేసు దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. పిటిషన్​ను పరిశీలించి ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని హెచ్చరించింది.

ఇదీ చదవండి :భారత్‌లో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు

ABOUT THE AUTHOR

...view details