తెలంగాణ

telangana

పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. ఐదుగురు యువకులు దుర్మరణం

By

Published : Nov 22, 2022, 9:21 AM IST

Updated : Nov 22, 2022, 10:35 AM IST

road accident in kaliabor

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాక్సీ బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు మృతిచెందారు. ఈ ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. ఐదుగురు యువకులు దుర్మరణం

అసోంలోని కలియాబోర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు మృతిచెందారు. వీరందరూ పెళ్లికి వెళ్లి వస్తుండగా సోమవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే ట్రక్కు డ్రైవర్ ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. మృతులను వివేక్ దాస్, సమీర్ పాల్, వికాస్ శర్మ, సందీప్ కుమార్, సంజయ్ దాస్​గా పోలీసులు గుర్తించారు. మృతులందరూ గోలాఘాట్​ జిల్లాలోని బోఖాఘట్​కు చెందినవారని తెలుస్తోంది.

మృతి చెందిన యువకులు

ట్యాక్సీ బోల్తాకొట్టి..
ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాక్సీ బోల్తా కొట్టి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 12 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం 5 గంటలకు జరిగిందీ ఘటన.

ప్రమాదానికి గురైన వాహనం

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న గ్రామస్థులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జేసీబీ సహాయంతో ట్యాక్సీని బయటకు తీశారు పోలీసులు. ప్రమాదానికి గురైన కారుపై ఉత్తర్​ప్రదేశ్ నంబర్ ప్లేటు ఉందని వెల్లడించారు. అలాగే మృతుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. డ్రైవర్ నిద్రలో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Last Updated :Nov 22, 2022, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details