తెలంగాణ

telangana

'భారత్, పోర్చుగల్​ మధ్య సోదర బంధం'​

By

Published : Mar 16, 2021, 11:18 AM IST

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్​కు శాశ్వత సభ్యత్వం ప్రతిపాదనను పోర్చుగల్​ సమర్థిస్తుందని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు ద్యువార్తె పషికో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య మంచి బంధం ఉందని తెలిపారు.

Parliamentary Union Duarte Pacheco
'భారత్ పోర్చుగల్​ మధ్య సోదర బంధం'​

ఐరాస భద్రతా మండలిలో భారత్​కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్​ను సమర్థించారు ఇంటర్​ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు, పోర్చుగల్ చట్టసభ్యుడు ద్యువార్తె పషికో. భారత్​... అన్ని రకాల రాజకీయ, మత సిద్ధాంతాలను గౌరవిస్తుందని.. మహిళలు, యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పార్లమెంటులోని సెంట్రల్​ హాల్​లో మంగళవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న పషికో.. ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రసంగిస్తున్న ద్యువార్తె
ప్రధాని మోదీతో ద్యువార్తె

భారత్​, పోర్చుగల్​ మధ్య ప్రత్యేక బంధం ఉంది. గత 500 ఏళ్లుగా ఈ బంధం కొనసాగుతోంది. ఇరు దేశాలు స్నేహితులు అని చెప్పే కన్నా సోదరులు అని చెబుతాను. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్​కు శాశ్వత స్థానం కల్పించాలన్న ప్రతిపాదనను పోర్చుగల్ సమర్థిస్తుంది.

-ద్యువార్తె పషికో, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు

ఇదీ చదవండి :జయ మరణంపై సీఎంకు స్టాలిన్​ సవాల్

ABOUT THE AUTHOR

...view details