తెలంగాణ

telangana

ఆ అనాథ చిన్నారులకు పీఎం కేర్స్​ అండ

By

Published : Dec 28, 2021, 4:50 AM IST

Updated : Dec 28, 2021, 6:39 AM IST

pm cares

PM Cares for Children: 'పీఎం కేర్స్​ ఫర్​ చిల్​డ్రన్' ద్వారా మహమ్మారి కారణంగా అనాథులైన చిన్నారులకు సాయం అందించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 3481 దరఖాస్తులను ఆమోదించినట్లు పేర్కొంది.

PM Cares for Children: కరోనా కారణంగా అనాథులైన 3481 చిన్నారులకు 'పీఎం కేర్స్​ ఫర్​ చిల్​డ్రన్​' పథకం అండగా నిలుస్తుందని కేంద్రం సోమవారం వెల్లడించింది. ఈనెల 24 నాటికి మొత్తం 6098 దరఖాస్తులు అందగా.. అందులో నుంచి 3481 అప్లికేషన్లను జిల్లా మెజిస్ట్రేట్లు ఆమోదించినట్లు పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటికే 3275 మందికి పోస్ట్​ ఆఫీస్​ ఖాతాలు కూడా తెరిచినట్లు కేంద్రం తెలిపింది.

ఈ పథకంలో భాగంగా సంరక్షణ సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు నెలకు రూ.2160 చొప్పున కేంద్రం అందించనుంది. మరోవైపు స్వతంత్రంగా నివసిస్తున్న పిల్లలకు నెలకు రూ.2000 చొప్పున అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది.

మహిళల కోసం..

ఇప్పటికే దేశవ్యాప్తంగా 704 సఖి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. డిసెంబరు 24 నాటికి వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న 54 లక్షలపైగా మహిళలకు సాయం అందించామని తెలిపింది.

ఇదీ చూడండి :గోవా, మణిపుర్​లో తొలి ఒమిక్రాన్ కేసు- కేరళలో నైట్ కర్ఫ్యూ

Last Updated :Dec 28, 2021, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details