తెలంగాణ

telangana

వెండి గాజులు దొంగలించిందని బాలిక హత్య.. ఇంట్లోనే పాతిపెట్టి..

By

Published : May 9, 2022, 4:56 AM IST

neighbor woman kills girl
neighbor woman kills girl ()

neighbour woman kills girl: రాజస్థాన్​లో ఘోరం జరిగింది. వెండి గాజులు దొంగలించిందన్న నెపంతో బాలికను హత్య చేసింది పొరుగింటి మహిళ. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా బాలిక శవాన్ని తన ఇంట్లోనే పాతిపెట్టింది.

neighbour woman kills girl: రాజస్థాన్​లోని జలావర్ జిల్లా​లో.. నాలుగేళ్ల బాలికను హత్య చేసింది ఓ మహిళ. అనంతరం ఆ చిన్నారి మృతదేహాన్ని తన సొంత ఇంట్లోనే పాతి పెట్టింది. ఓ వెండి గాజులను పొరపాటున తీసినందుకే ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ మహిళ. జిల్లా​లోని భవానీ మండిలో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది.. చంచల్ అనే బాలిక నిందితురాలి ఇంటి పక్కన నివసించేది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు చిన్నారి కనిపించకుండా పోయింది. సాయంత్రం వరకు వెతికినా ఎలాంటి ప్రయోజనం లేదు. దీంతో బాలిక తాతయ్య లక్ష్మీ నారాయణ్ మెహెర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, శనివారం రాత్రంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన పోలీసులు.. ఆదివారం ఉదయం నిందితురాలి ఇంటిని తనిఖీ చేశారు. ఆమె ఇంటి ప్రాంగణంలో మృతదేహాన్ని గుర్తించారు. మట్టిలో నుంచి శవాన్ని బయటకు తీసి.. పోస్టు మార్టంకు తరలించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మోనికా సేన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలిక కాలికి వెండి గాజులు ఉన్నాయని తెలిపారు. వాటిని దొంగలించిందనే కారణంతోనే చిన్నారిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో విచారణ చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:కులాంతర వివాహం.. ప్రభుత్వ పథకాలు కట్​- ఆ గ్రామంలో వితంతు ఆచారాలు బంద్

ABOUT THE AUTHOR

...view details