తెలంగాణ

telangana

నీట్​ పీజీ కౌన్సిలింగ్​కు బ్రేక్​.. సుప్రీం నిర్ణయం తర్వాతే!

By

Published : Oct 25, 2021, 1:58 PM IST

Updated : Oct 25, 2021, 2:55 PM IST

తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నీట్-పీజీ కౌన్సిలింగ్​ (NEET PG Counselling) నిర్వహించబోమని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కౌన్సిలింగ్​కు బ్రేక్​ పడినట్లయింది.

NEET-PG counselling
నీట్​కు బ్రేక్​

నీట్​లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కోటాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు పీజీ కౌన్సిలింగ్‌ (NEET PG Counselling) నిర్వహించబోమంటూ కేంద్రం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది. నీట్‌లో రిజర్వేషన్ల చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం చేసిన సూచనకు అంగీకరించింది. రిజర్వేషన్లపై నిర్ణయం తేలకుండా కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తే విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నీట్‌ పీజీ ఆల్‌ఇండియా కోటాలో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)లకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఏడాది జులై 29న మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నోటిషికేషన్‌ జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొంతమంది నీట్‌ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పీజీ మెడికల్‌ కోర్సుల్లో రిజర్వేషన్ల విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా నీట్‌ పీజీలో రిజర్వేషన్లు కేటాయించారని, దీనివల్ల జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోయి మైనార్టీలుగా మిగిలిపోతారని పిటిషనర్లు ఆరోపించారు. ఇది ప్రతిభావంతులకు అవకాశాలు నిరాకరించడమే అవుతుందని పేర్కొన్నారు.

దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతోంది. ఇదిలా ఉండగా.. అక్టోబరు 25 నుంచి నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కేంద్రం ప్రకటించింది. దీంతో పిటిషనర్లు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం.. రిజర్వేషన్ల చెల్లుబాటుపై కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు కౌన్సెలింగ్‌ చేపట్టబోమని కేంద్రం కూడా హామీ ఇచ్చింది.

ఇదీ చూడండి:'గత ప్రభుత్వాలు డబ్బు వేట.. మేము ప్రజల వెంట'

Last Updated : Oct 25, 2021, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details