తెలంగాణ

telangana

ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం.. ముస్లిం కుటుంబం భారీ విరాళం

By

Published : Mar 22, 2022, 7:28 PM IST

Updated : Nov 28, 2022, 12:16 PM IST

Muslim Family Donates to Temple: మత సామరస్యానికి మన దేశం ప్రతీకగా నిలుస్తోంది. దీనిని రుజువుచేసే ఘటన బిహార్​లో మరొకటి వెలుగుచూసింది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం కోసం.. రూ. 2.5 కోట్లు విలువచేసే భూమిని విరాళంగా ఇచ్చింది ఓ ముస్లిం కుటుంబం.

Muslim family donates Rs 2.5 crore land for construction of world's largest temple in Bihar
Muslim family donates Rs 2.5 crore land for construction of world's largest temple in Bihar

Muslim Family Donates to Temple: 'హిందూ- ముస్లిం భాయీభాయీ'..మనదేశంలో సుపరిచితమైన నానుడి. హిందూ- ముస్లిం సఖ్యతను చాటిచెప్పే నినాదం ఇది. దీన్ని నిజం చేస్తూ.. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది బిహార్​లోని ఓ ముస్లిం కుటుంబం. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఎత్తైన హిందూ దేవాలయ నిర్మాణం బిహార్​ తూర్పు చంపారన్​ జిల్లా కైథ్​వలియాలో జరుగుతోంది. ఈ 'విరాట్​ రామాయణ మందిర్​' నిర్మాణం కోసం రూ. 2.5 కోట్లు విలువచేసే భూమిని విరాళంగా ఇచ్చిందో ముస్లిం కుటుంబం.

Virat Ramayan Mandir: ఆలయ నిర్మాణానికి ఏదైనా చేయడం తన బాధ్యత అని చెబుతున్నారు వ్యాపారి అయిన ఇష్తియాక్​ అహ్మద్​ ఖాన్​. తనకు, తన కుటుంబానికి చెందిన 23 కట్టా లేదా 71 డిసిమల్స్​ భూమిని (0.71 ఎకరాలు) ఆలయానికి ఇచ్చారు. కేసరియా సబ్​డివిజన్​లోని రిజిస్ట్రార్​ కార్యాలయంలో సంబంధిత ప్రక్రియను పూర్తిచేశారు.

''గ్రామంలో ఎక్కువ భూమి మా కుటుంబానికే ఉంది. అందుకే.. నా బాధ్యతగా ఆలయ నిర్మాణానికి ఏదైనా చేయాలనుకున్నాను. ఇది మాకు సంప్రదాయంగా వస్తోంది.''

- ఇష్తియాక్​ అహ్మద్​ ఖాన్​, దాత

విరాట్​ రామాయణ్​ మందిర్​ ఆలయ నిర్మాణం బాధ్యతను పట్నాకు చెందిన మహవీర్​ మందిర్​ ట్రస్ట్​ చూస్తోంది. 'గువాహటిలో వ్యాపారం చేసే ఖాన్​ కుటుంబం.. ఆలయం నిర్మాణం కోసం సాయం చేస్తామని ఎప్పటినుంచో చెబుతోందని' అని పేర్కొన్నారు ట్రస్ట్​ అధ్యక్షుడు ఆచార్య కిశోర్​ కునాల్​. ప్రధాన రహదారిపై ఉన్న భూమిని కూడా సబ్సిడీ ధరకు ఇచ్చారని తెలిపారు. అహ్మద్​ ఖాన్​ను ఆదర్శంగా తీసుకొని.. భూమిని ఇచ్చేందుకు చాలా మంది ముందుకొస్తున్నారని, ఇప్పటివరకు మొత్తం 100 ఎకరాల భూమిని సేకరించినట్లు వివరించారు.

''ఖాన్​ కుటుంబం.. మత సామరస్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. ముస్లింల సాయం లేకుంటే.. అసలు ఈ కలల ప్రాజెక్ట్​ సాకారం అవ్వడం కష్టం.''

- కిశోర్​ కునాల్​, ట్రస్ట్​ చీఫ్​

ఈ హిందూ దేవాలయం మొత్తం 125 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్నట్లు కునాల్​ తెలిపారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణంలో భాగమైన.. అనుభవజ్ఞులైన హస్తకళాకారులు, సాంకేతిక నిపుణులు ఇందుకోసం పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

Worlds Largest Temple: విరాట్​ రామాయణ ఆలయం ఎత్తు 270 అడుగులు ఉంటుందని కునాల్​ చెప్పారు. 1080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఆలయంగా చరిత్ర లిఖిస్తుందని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముడు జానక్​పుర్​ నుంచి అయోధ్యకు తిరిగొస్తుండగా రాత్రిపూట బసచేసినట్లుగా విశ్వసించే దేవకీ నదిని ఆనుకొని ఈ ఆలయ నిర్మాణం జరగనుందని అన్నారు.

ఇవీ చూడండి:హిందూ దేవుడికి పరమ భక్తుడైన ముస్లిం!

మహాశివుడికి ముస్లిం సోదరుల నిత్య పూజలు!

ముస్లిం నిర్మించిన హిందూ దేవాలయం- ఎక్కడంటే..?

భర్త కట్టించిన దుర్గమ్మ గుడిలో ముస్లిం మహిళ పూజలు

Last Updated : Nov 28, 2022, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details