Militants Killed in Srinagar: జమ్ముకశ్మీర్ శ్రీనగర్లో గత సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపి, ఓ జవాను మృతికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారు పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారని గుర్తించారు. ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు.
'ఏప్రిల్ 4న సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిపిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ముందస్తు సమాచారంతో బిషేంబర్ నగర్లో సోదాలు చేశాము. ఆ సమయంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి కారణంగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.' అని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఆపరేషన్ను భద్రతా దళాల విజయంగా ఆయన పేర్కొన్నారు. అమాయక ప్రజలపై , జర్నలిస్టులపై దాడి చేస్తే తగిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినవారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.