ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మశాలలో జరుగుతున్న తవ్వకాల కారణంగా.. ధులియా గంజ్ ప్రాంతంలో ఆరు ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అతని ఇద్దరు కుమార్తెలు చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఓ నాలుగేళ్ల చిన్నారి మరణించగా.. మరో ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఇంకా అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
కుప్పకూలిన 6 ఇళ్లు.. చిన్నారి మృతి.. శిథిలాల కింద అనేక మంది!
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో ఘోర ప్రమాదం జరిగింది. ధులియా గంజ్ ప్రాంతంలో ఆరు ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో ఓ బాలిక మరణించగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
many-people-buried-under-debris-due-to-houses-collapse-during-excavation-in-agra
ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. సహాయక చర్యలను ముమ్మరం చేయమని అధికారులు, పోలీసులకు సూచించారు. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో జరిగింది. ధర్మశాల ట్రస్ట్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు.
Last Updated : Jan 26, 2023, 10:59 AM IST