కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారయత్నం.. పెళ్లైన 20రోజులకే ఆత్మహత్య

author img

By

Published : Jan 25, 2023, 11:07 PM IST

Bihar Rape Incident

బిహార్​లో కామాంధులు రెచ్చిపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా టీచర్​పై అత్యాచారయత్నం చేశారు ఐదుగురు దుండగులు. కాపాడమని బస్సు డ్రైవర్​, కండక్టర్​ను బాధితురాలు ఎంతగా బతిమాలినా వారు పట్టించుకోలేదు. దీంతో తనను తాను కాపాడుకునే క్రమంలో మహిళ.. కదులుతున్న బస్సులో నుంచి కిందకు దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.

బిహార్​లోని పూర్ణియా జిల్లాలో ఘోరం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా టీచర్​పై అత్యాచారయత్నం చేశారు ఐదుగురు దుండగులు. తనను రక్షించమని బస్సు డ్రైవర్​, కండక్టర్​ను ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో తనను తాను రక్షించుకునే సమయంలో ఆ మహిళ కదులుతున్న బస్సులో నుంచి దూకి నిందితుల చెర నుంచి బయటపడింది. కాగా వేగంగా కదులుతున్న బస్సులో నుంచి దూకడం వల్ల ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉంది.

పోలీసులు తెలిపిన వివరాలు..
బంగాల్​లోని డార్జిలింగ్‌కు చెందిన 35 ఏళ్ల మహిళా టీచర్​ మంగళవారం రద్దీగా ఉన్న ఓ బస్సులో ప్రయాణిస్తోంది. బస్ స్టాప్​లు వస్తున్న కొద్దీ అందులో ఉన్న ప్యాసింజర్లు ఒక్కొక్కరుగా దిగిపోయారు. చివరకు ఐదుగురు వ్యక్తులు, మహిళా టీచర్ మిగిలారు. బస్సులో ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన దుండగులు మొదట అసభ్యకర సైగలు చేయడం ప్రారంభించారు. అనంతరం ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు.

ఈ సమయంలో తనను కాపాడమని బస్సు డ్రైవర్​, కండక్టర్​ను మహిళ ప్రాధేయపడింది. అయినప్పటికీ.. వారు స్పందించకుండా బస్సును అలాగే ముందుకు పోనిచ్చారు. ఇదే అదనుగా భావించిన నిందితులు మరింత రెచ్చిపోయి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తనను తాను రక్షించుకునేందుకు ఆ మహిళ.. కదులుతున్న బస్సులో నుంచి దూకేసింది. కామాంధుల చెర నుంచి బయట పడ్డప్పటికీ.. ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం మహిళ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే బస్సును గుర్తించామని, నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

పెళ్లైన 20 రోజులకే ఆత్మహత్య
ఇరవై రోజుల క్రితమే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. గుజరాత్​లోని సూరత్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సచిన్ జీఐడీసీ ప్రాంతంలో నివాసం ఉండే ప్రదీప్​ కుమార్​ ​(18) అనే యువకుడు ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కుటుంబంతో కలిసి సచిన్ జీఐడీసీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు ఓ ప్రాక్టరీలో పనిచేస్తున్నాడు. మంగళవారం సాయత్రం 5 గంటలకు విధులు ముగించుకుని ఇంటికొచ్చాడు. అనంతరం కూరగాయాలు తెచ్చేందుకు మార్కెట్​కు వెళ్లాడు​. ఇంటికొచ్చిన అనంతరం తన రూంలోకి వెళ్లి పడుకున్నాడు. ఉదయం భార్య లేచి చూసే సరికి ప్రదీప్​ ఉరివేసుకుని కనిపించాడు. దీంతో ఆందోళన చెందిన ప్రదీప్​ భార్య.. చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. వారంతా వచ్చి ప్రదీప్​ మెడకు ఉన్న తాడును విప్పి కిందకు దింపారు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రదీప్​ చనిపోయినట్లుగా డాక్టర్లు తేల్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.

"మాది బిహార్‌లోని మధుబని జిల్లా కొధియా గ్రామం. ప్రస్తుతం సూరత్​లో నివాసం ఉంటున్నాం. మేమిద్దరం రెండేళ్లుగా ప్రేమించుకున్నాం. 20 రోజుల క్రితమే మా పెళ్లి జరిగింది. మంగళవారం సాయత్రం ఫ్యాక్టరీ నుంచి ఇంటికొచ్చిన నా భర్త చాలా ఒత్తిడిలో కనిపించాడు. రాత్రి అన్నం కూడా తినలేదు. పొద్దున్నే చూసేసరికి ఉరి వేసుకుని కనిపించాడు" అని మృతుడి భార్య వాపోయింది.

..
భార్యతో ప్రదీప్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.