Man Suicide For Wife 5th Marriage : తన భార్య ఐదో వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ భర్త తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇందోర్లో జరిగింది. వారం రోజుల క్రితం నిప్పంటించుకోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
మధ్యప్రదేశ్ ఇందోర్కు చెందిన సునీల్ లోహానీ అనే 35 ఏళ్ల వ్యక్తి 2018లో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. అతడు ఆమెకు నాలుగో భర్త. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడటం వల్ల ఆమె గతేడాది అతడిని వదిలి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అక్కడే నివసిస్తున్న ఆమె మరో వ్యక్తిని ఐదో వివాహం చేసుకుంది. ఈ విషయం సునీల్కు తెలియడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గత వారం ఓ సూసైడ్ వీడియోను రికార్డు చేసి మరీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసుకుని తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అప్పటికే స్థానికులు, కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయలతో వారం పాటు చికిత్స పొందిన సునీల్, శనివారం మృతి చెందాడు.