తెలంగాణ

telangana

50 మంది మహిళలను మోసం చేసిన కీచకుడు అరెస్ట్​

By

Published : Jan 12, 2022, 8:46 AM IST

haldwani news,
50 మంది మహిళలను మోసం చేసిన కీచకుడు అరెస్ట్​

Haldwani news: 50 మంది మహిళలను మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బాధితుల నుంచి రూ.లక్షలు దండుకోవడమే గాక, బలవంతం చేసి లైంగిక వాంఛ తీర్చుకున్నాడని అధికారులు వెల్లడించారు.

Haldwani news: ఉత్తరాఖండ్ నైనితాల్​ జిల్లా హల్ద్వానీలో 50 మందికి పైగా మహిళలను మోసం చేసిన ఓ కీచకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని వారి నుంచి రూ.లక్షలు దండుకోవడమే గాక, లైంగికంగా వేధించాడని, బలవంతంగా శృంగార వాంఛ తీర్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. బఘేశ్వర్​కు చెందిన ఈ నిందితుడి పేరు చారు చంద్ర జోషి. ప్రస్తుతం హల్ద్వానీ దొన్హారియా ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్నాడు. చంబల్​ వంతెన సమీపంలోని ఓ పార్కు వద్ద పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. చారు చంద్ర జోషి సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​ ద్వారా మహిళలను పరిచయం చేసుకుంటాడు. నర్సింగ్​ కోర్సు(జీఎన్​ఎం) చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని వాళ్లకు మాయమాటలు చెబుతాడు. తాను జిల్లా మెడికల్​ ఆఫీసర్​నని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబుచ్చుతాడు. అందుకు డబ్బులు కావాలని చెప్పి రూ.లక్షలు తీసుకుంటాడు. ఒక్కోసారి బలవంతం చేసి లైంగిక వాంఛ కూడా తీర్చుకుంటాడు.

ఇలా మొత్తం 50మందికిపైగా మహిళలను చంద్ర మోసం చేశాడని క్రైం బ్రాంచ్ ఎస్పీ జగదీశ్ చంద్ర తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని హల్ద్వానీ ప్రాంతంలో ఓ మహిళ నుంచి రూ.5లక్షలు తీసుకున్నాడని చెప్పారు. విచారణలో ఇంకా చాలా నిజాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. అన్ని నేరాలను నిందితుడు అంగీకరించాడన్నారు.

అయితే చారు చంద్రపై ఇప్పటివరకు రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. సమాజంలో పరువు, ప్రతిష్ఠల గురించి ఆలోచించి మిగతా మహిళలు పోలీసు కేసు పెట్టలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం దర్యాప్తు చేపడతామన్నారు.

ఇదీ చదవండి:'ఇష్టం లేని శృంగారాన్ని వద్దనే హక్కు 'ఆమె'కు ఉంటుంది'

ABOUT THE AUTHOR

...view details