కేరళలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం కొత్తగా 32,097 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో క్రియాశీల కేసుల సంఖ్య లక్ష దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. పాజిటివిటీ రేటు 18.41శాతంగా ఉందన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో క్రియాశీల కేసుల సంఖ్య 10వేల నుంచి లక్ష వరకు ఉంది. కేరళ నుంచి వచ్చి రాజ్యాంగపరంగా విధులు నిర్వర్తించేవారు, ఆరోగ్య సిబ్బంది, అధికారులకు క్వారంటైన్ నుంచి మినహాయింపునిస్తున్నట్టు కర్ణాటక ప్రకటించింది.
ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు..
- మహారాష్ట్రలో కొత్తగా 4,342 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. 4,755 మంది కోలుకోగా.. 55మంది వైరస్కు బలయ్యారు.
- కర్ణాటకలో కొత్తగా 1,240 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,252 మంది వైరస్ను జయించగా.. 22 మృతిచెందారు.
- తమిళనాడులో కొత్తగా 1562 కరోనా కేసులు బయటపడ్డాయి. 1684 మంది కోలుకోగా.. 20 మంది మృతిచెందారు.
- ఒడిశాలో కొత్తగా 754 మందికి కరోనా సోకింది. వైరస్ నుంచి కొత్తగా 666 మంది కోలుకున్నారు. మహమ్మారి ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
300 మందికి..