తెలంగాణ

telangana

ప్రభుత్వంపై స్వామీజీ విమర్శలు.. మైకు లాక్కున్న సీఎం

By

Published : Jan 27, 2023, 6:39 PM IST

Updated : Jan 27, 2023, 6:47 PM IST

Karnataka cm bommai
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై

ముఖ్యమంత్రి పక్కన కూర్చుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఓ స్వామీజీ. దీంతో తీవ్ర అసహనానికి గురైన సీఎం.. స్వామీజీ చేతుల్లో నుంచి మైక్​ను లాక్కున్నారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

ముఖ్యమంత్రి పక్కన కూర్చుని ఓ స్వామీజీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర అసహనానికి గురైన కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై.. ఆ స్వామీజీ చేతుల్లో నుంచి మైకు లాక్కుని విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కర్ణాటకలోని మహదేవపురలో ఓ బహిరంగ కార్యక్రమంలో జరిగిందీ ఘటన. ఈ కార్యక్రమంలో కాగినేలె మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరనందపురి స్వామీజీ పాల్గొన్నారు. బెంగళూరులో సరైన మౌలికసదుపాయాలు లేక నగరవాసులు పడుతున్న అవస్థలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు ఈశ్వరనందపురి స్వామీజీ. అలాగే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

"బెంగళూరులో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తున్నారు. ఇవన్నీ మేం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులకు గురవకుండా ఏం చేయాలో అధికారులకు తెలియదా? సీఎం కూడా దీని గురించి గతంలో హామీలు ఇచ్చారు"

--ఈశ్వరనందపురి స్వామీజీ, కాగినేలె మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి

ఆ సమయంలో సీఎం బొమ్మై స్వామీజీ పక్కనే కూర్చున్నారు. ఆయన మాటలతో తీవ్ర అసహనానికి గురైన ముఖ్యమంత్రి.. స్వామీజీ మాట్లాడుతుండగానే మైకును చేతుల్లో నుంచి లాగేసుకున్నారు. "కేవలం హామీలు ఇచ్చి మర్చిపోయే ముఖ్యమంత్రిని కాదు నేను. అది కేవలం హామీ మాత్రమే కాదు. దానిపై మేం ఓ పథకం తీసుకొచ్చాం. నిధులు కూడా కేటాయించాం. పని జరుగుతోంది" అని విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. స్వామీజీ నుంచి సీఎం మైకును లాక్కుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన ఆసక్తికరంగా మారింది.

Last Updated :Jan 27, 2023, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details