తెలంగాణ

telangana

Agnipath Scheme: ఆర్మీ, నేవీలో రిక్రూట్​మెంట్​ ప్రక్రియ షురూ!

By

Published : Jul 1, 2022, 10:36 PM IST

Agneepath scheme army: అగ్నిపథ్ పథకం కింద సైనికుల నియామక ప్రక్రియను ఆర్మీ, నేవీ ప్రారంభించాయి. భారతీయ ఆర్మీ, వైమానిక దళంలో అగ్నివీరుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం మొదలైందని తెలిపింది.

Army recruitment 2022 news
Army recruitment 2022 news

Agneepath scheme army: అగ్నిపథ్ విధానం ద్వారా సైనిక నియామకాల ప్రక్రియను ఆర్మీ, నేవీ ప్రారంభించాయి. భారతీయ ఆర్మీ, నౌకాదళం నియామక ప్రక్రియను శుక్రవారం ప్రారంభించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. భారతీయ ఆర్మీ, వైమానిక దళంలో అగ్నివీరుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం మొదలైందని తెలిపింది. 'అగ్నివీరులుగా చేరి దేశానికి సేవ చేయాలనే మీ కలను సాకారం చేసుకోండి అంటూ' యువతకు రక్షణశాఖ పిలుపునిచ్చింది. అగ్నిపథ్ విధానం కింద భారతీయ వాయుసేన జూన్ 24 నుంచే నియామక ప్రక్రియను చేపట్టగా గురువారం నాటికి సుమారు 2 లక్షల 72 వేల దరఖాస్తులు వచ్చాయి.

IAF Agnipath Scheme: త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ ​14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది (2022) రిక్రూట్​మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. దీంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పలు రాష్ట్రాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగానూ మారాయి. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న పంజాబ్‌ వంటి రాష్ట్రాలు కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసే యోచనలోనూ ఉన్నాయి.

ఇదీ చదవండి:'అమిత్​ షాను అప్పుడే అడిగా.. ఆయన ఓకే చెప్పి ఉంటే ఇలా అయ్యేదా?'

ABOUT THE AUTHOR

...view details