Petrol theft in Maharashtra: అక్రమ పెట్రోల్ విక్రయ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. మహారాష్ట్ర నాగ్పుర్లోని బెల్తరోడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాప్రీ గ్రామంలో నివసిస్తున్న మీనా ద్వివేది అనే మహిళ ఇంటి నుంచి 12 వేల లీటర్ల పెట్రోల్ను స్వాధీనం చేసుకున్నారు. విదర్భ పెట్రోల్ డిపో నుంచి బయలుదేరిన ట్యాంకర్ల నుంచి సదరు మహిళ కొంత మొత్తంలో పెట్రోల్ను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. 'ఆమె తన ఇంట్లోనే మినీ పెట్రోల్ బంకు నడుపుతోంది.. దీనిని చూసి షాక్ అయ్యాం' అని పోలీసులు చెప్పారు. గత కొన్ని నెలలుగా ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
పెట్రోల్ చోరీ ఇలా..
fuel theft from petrol tanker: ట్యాంకర్ల నుంచి చోరీ జరగకుండా పెట్రోలియం కంపెనీలు అమర్చే రెండంచెల భద్రతా వ్యవస్థను అక్రమార్కులు చాకచక్యంగా తెరవగలుగుతున్నారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోపాల్ బిరాదార్ తెలిపారు.