Beef seized: 21వేల కిలోల బీఫ్ పట్టివేత- ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Dec 5, 2021, 8:04 PM IST

Beef seized

Beef seized: తమిళనాడు నుంచి ముంబయి, ఠాణెకు అక్రమంగా గొడ్డు మాంసం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు మహారాష్ట్ర పోలీసులు. దాదాపు రూ.20 లక్షల విలువైన 21,000 కిలోల బీఫ్​ను స్వాధీనం చేసుకున్నారు.

Beef seized: కంటైనర్​లో గొడ్డు మాంసం(బీఫ్)​ అక్రమంగా తరలిస్తున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసిన పోలీసులు.. 21 వేల కిలోల గొడ్డు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు.

మహారాష్ట్రలో బీఫ్​ విక్రయాలను నిషేధించారు. ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి ముంబయి, ఠాణెలకు అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న స్థానిక క్రైమ్​ బ్రాంచ్ పోలీసులు.. పాల్ఘర్​ జిల్లాలోని ముంబయి-అహ్మదాబాద్​ రహదారిపై కాపు కాశారు.​​ అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ కంటైనర్​ ఆపి.. తనిఖీ చేశారు. దీనిపై నిందితులను నిలదీయగా.. పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్పటికే వలపన్నిన పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. 21,018 కిలోల గొడ్డు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తమిళనాడుకు చెందిన కే రాజేంద్ర, రంజిత్​ కుమార్​లుగా గుర్తించారు.

ఈ ఘటనపై జిల్లాలోని కాసా పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.