వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

author img

By

Published : Dec 5, 2021, 3:53 PM IST

madhya pradesh road accident

road accident in mp: మధ్యప్రదేశ్​లో శనివారం అర్ధరాత్రి రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా... ఇరవై మందికి గాయాలయ్యాయి.

road accident in mp: మధ్యప్రదేశ్​లో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బైక్​ను ఢీకొట్టి ట్రక్కు..

రాజ్​గఢ్​ జిల్లాలో ట్రక్కు.. బైక్​ను ఢీకొన్న ఘటనలో ఓ సోదరి, సోదరుడుతో సహా మరో బాలిక మరణించారు. జాతీయ రహదారి-52పై అతి వేగంతో ఉన్న ట్రక్కు.. బైక్​ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. లారీ​ డ్రైవర్​పై కేసు నమోదు చేసి.. ట్రక్కు​ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ట్రాక్టర్​ బోల్తా..

పన్నా జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు జటాశంకర్​ దామ్​ నుంచి తమ సొంత గ్రామం భూపత్​పుర్​కు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:ఐదుగురు పిల్లలతో బావిలో దూకి మృత్యుఒడికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.