తెలంగాణ

telangana

వరుణుడి పంజాకు 164 మంది బలి- ఊళ్లన్నీ జలమయం

By

Published : Jul 26, 2021, 2:14 PM IST

Updated : Jul 26, 2021, 10:30 PM IST

మహారాష్ట్రలో వరదలు బీభత్సం సృష్టించాయి. కొల్హాపుర్​ షిరోలీ ప్రాంతంలోని ఇళ్లు, రోడ్లు, వాణిజ్య భవంతులు పూర్తిగా నీట మునిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఎన్​డీఆర్​ఎఫ్​ అధికారి తెలిపారు.

Maharashtra Floods
మహారాష్ట్రలో వరదలు

భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తాయి. ఎటుచూసినా వరదనీటితో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొల్హాపుర్​లోని షిరోలీ ప్రాంతంలోని ఇళ్లు, రోడ్లు, వాణిజ్య భవంతులు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి.

గస్తీ నిర్వహిస్తున్న ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం
నీట మునిగిన ఇళ్లు
నీట మునిగిన వాణిజ్య భవనాలు

ఆరు బృందాలుగా..

కొల్హాపుర్​లో ఆరు ఎన్​డీఆర్​ఎఫ్ విపత్తు బృందాలను అధికారులు మోహరించారు. ఇప్పటివరకు 1500 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్​డీఆర్​ఎఫ్​ అసిస్టెంట్ కమాండెంట్​ విక్రమ్​ తెలిపారు. సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు తాము జిల్లా యంత్రాంగం, సివిల్​ వర్క్స్​ విభాగంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుత నీటిమట్టం 2 ఫీట్లు తగ్గిందని.. అయినా వరద ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తోందన్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు
అస్వస్థతకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తూ..
వైద్య సేవల కోసం అంబులెన్సు..

164కు చేరిన మృతులు..

వర్షాల కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 164కు చేరింది. సోమవారం మరో 15 మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 100 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2,29,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

ఆ ఘటనలో 53 మంది మృతి

రాయిగడ్​ జిల్లాలో తాలియేలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 53 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో ఐదుగురు గాయపడ్డారని వెల్లడించారు. సహాయక చర్యలు ముగిసిన నేపథ్యంలో ఈ మేరకు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

మహారాష్ట్రలో వరద విలయం- 149కి చేరిన మృతులు

కర్ణాటకలో జల విలయం- వరద గుప్పిట్లో ప్రజలు

Last Updated :Jul 26, 2021, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details