ETV Bharat / bharat

మహారాష్ట్రలో వరద విలయం- 149కి చేరిన మృతులు

author img

By

Published : Jul 26, 2021, 4:47 AM IST

maharastra floods
మహారాష్ట్రలో వరద విలయం

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 149కి పెరిగింది. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా.. 64 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేసింది ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం.

మహారాష్ట్రలో కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా మహారాష్ట్రలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 149కి చేరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా.. 64 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2,29,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

maharastra floods
మహారాష్ట్రలో భారీ వర్షాలకు విరిగిన చెట్లు
maharastra floods
వరద విలయం

కొంకణ్‌ ప్రాంతంలోని రత్నగిరి, రాయ్‌గఢ్‌ జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. ఈ రెండు జిల్లాల నుంచి తాజాగా మరో 36 మృతదేహాలు బయటపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాయ్‌గఢ్‌ జిల్లాలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. సతారా జిల్లాలో 41 మంది మరణించారు.

maharastra floods
కూలిన ఇళ్లు

ఇవీ చదవండి:వరద బీభత్సం - జనజీవనం అస్తవ్యస్తం

మహారాష్ట్రలో వరద విలయం-112 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.