తెలంగాణ

telangana

ఇంటిపై ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు మృతి

By

Published : Oct 12, 2021, 3:42 PM IST

rainfall in kerala
భారీ వర్షాలు ()

భారీ వర్షాల ధాటికి ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాదం కేరళలో (Heavy Rainfall in Kerala) జరిగింది.

కేరళలో (Heavy Rainfall in Kerala) కుండపోత వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. మలప్పురం జిల్లాలోని కరిప్పుర్​లో ఈ ఘటన జరిగింది. చనిపోయినవారిలో ఆరు నెలల చిన్నారి రింజానా సహా ఆమె 8 ఏళ్ల సోదరి రిజ్వానా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

చనిపోయిన చిన్నారులు

ముందోట్టుపదం సమీపంలోని మతాంకులంలో ఉన్న ఈ ఇల్లు చిన్నారుల తాతదని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 4.30గంటల సమయంలో పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం కూలి వారున్న ఇంటిపై పడటం వల్ల ఈ విషాద ఘటన జరిగిందని (Kerala Rainfall News) స్థానికులు తెలిపారు.

కూలిన ఇల్లు

చిన్నారులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలించినా ప్రాణాలు దక్కలేదు.

సోమవారం నుంచి కేరళలో జోరుగా వర్షం పడుతోంది. అక్టోబర్​ 15 వరకు భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని (Heavy Rainfall Alert in Kerala) అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. ఏడుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details