తెలంగాణ

telangana

బస్సును ఢీకొట్టిన డంపర్- 13మంది సజీవదహనం

By PTI

Published : Dec 28, 2023, 6:39 AM IST

Updated : Dec 28, 2023, 11:14 AM IST

Guna Bus Accident : డంపర్​ ఢీకొనడం వల్ల ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమమ్యారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్​లోని గుణ జిల్లాలో జరిగింది.

Guna Bus Accident
Guna Bus Accident

Guna Bus Accident :మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13మంది సజీవ దహనమయ్యారు. మరో 13మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న డంపర్‌ ట్రక్కు ఢీకొనడం వల్ల ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను గుణ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. గుణ-ఆరోన్ రహదారిపై రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

Madhya Pradesh Bus Accident : మృతుల వివరాలను ధ్రువీకరించిన జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ ఖత్రి, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. అందులో నుంచి నలుగురు ప్రయాణికులు ఎలాగోలా బయటపడ్డారని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్​ రాఠీ తెలిపారు.

మధ్యప్రదేశ్​ ఘోర రోడ్డు ప్రమాదం

ముఖ్యమంత్రి విచారం
ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. దీంతోపాటు ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ఎక్స్​ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటన బాధకరమైనదిగా పేర్కొన్న సింధియా, దీని గురించి సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్​, ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

Road Accident in Jammu :ఈ ఏడాది నవంబర్​లో ఓ బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోతు లోయలో పడిపోవడం వల్ల 38 మంది చనిపోయారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జమ్ముకశ్మీర్​లోని​ డోడా జిల్లాలోని బాటోటె-కిష్ట్వార్​ జాతీయ రహదారిపై జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

24 మంది మృతులకు ఒకేచోట అంత్యక్రియలు.. డీఎన్​ఏ పరీక్ష ఆలస్యమవుతుందని..

నల్గొండలో బస్సు దగ్ధం - ఒకరు సజీవదహనం - 38 మందికి!

Last Updated :Dec 28, 2023, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details