తెలంగాణ

telangana

ఆందోళన ప్రదేశంలో ఇల్లు నిర్మిస్తున్న రైతు

By

Published : Mar 10, 2021, 5:24 PM IST

నూతన చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళ చేస్తున్న రైతుల ఎంత దృఢమైందో చెప్పడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణ. సాగు చట్టాలను రద్దు చేసే వరకు దిల్లీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఓ రైతు సింఘూ సరిహద్దులో ఇల్లును నిర్మించుకుంటున్నాడు. ఇప్పటికే ఇంటి నిర్మాణానికి కావల్సిన ఇటుకలు, సిమెంట్​ తెచ్చుకున్నాడు.

Fully functional house with AC being built at Singhu protest site
ఆందోళన ప్రదేశంలో ఇల్లు నిర్మిస్తోన్న రైతు

నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసేంత వరకు దిల్లీ సరిహద్దుల్ని విడిచివెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకూర్చున్నారు రైతులు. ఓ రైతు ఏకంగా ఒక అడుగు ముందుకేసి సింఘూ సరిహద్దులోని రైతు ఆందోళన ప్రదేశంలో శాశ్వత నివాసాన్ని నిర్మించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఇటుకలు, సిమెంటు తెచ్చుకుని ఇంటి నిర్మాణం మొదలెట్టాడు. జీటీ కర్నల్​ రోడ్డులో నిర్మించుకుంటున్న రెండు గదుల ఇంటిలో ఏసీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు.

ఆందోళన ప్రదేశంలో రైతు నిర్మిస్తోన్నఇల్లు
ఆందోళన ప్రదేశంలో ఇల్లు నిర్మిస్తోన్న రైతు

కొద్దిరోజులు గడిచాకైనా రైతులు ఇంటికి వెళతారు అని కేంద్రం భావించిందని భగత్​ సింగ్​ యూత్​ బ్రిగేడ్​ అనే సామాజిక మాధ్యమాన్ని నడుపుతున్న దీప్​ ఖాత్రి అనే వ్యక్తి అన్నాడు. కానీ సాగు చట్టాల్ని రద్దు చేసేంతవరకు రైతులు దిల్లీని వదిలి వెళ్లరని ఈటీవీ భారత్​కు తెలిపారు.

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వందరోజులకు పైగా దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్కచేయటం లేదు.

ఇదీ చూడండి:'సాగు చట్టాలు రద్దు చేసేవరకూ పోరాటం ఆగదు'

ABOUT THE AUTHOR

...view details