తెలంగాణ

telangana

హైదరాబాద్​లో పొగ మంచు ఎఫెక్ట్ - 30 విమానాలను ఇతర ఎయిర్​పోర్టులకు మళ్లించిన అధికారులు

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 2:01 PM IST

Updated : Dec 25, 2023, 2:22 PM IST

Fog Effect On Planes in Hyderabad : హైదరాబాద్​లో పొగ మంచు కారణంగా అధికారులు శంషాబాద్​కు రానున్న విమానాలను ఇతర ఎయిర్​పోర్టులకు మళ్లించారు. ఇప్పటివరకు 30 విమానాలను మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

Shamshabad Flights diverted due to fog effect
Shamshabad Flights diverted To Fog Effect in Hyderabad

Fog Effect On Planes in Hyderabad :తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయినా వాతావరణం పొగ మంచుతో కప్పుకుని ఉంటోంది. పొగమంచుతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక పాఠశాలలు, కళాశాలలు, ఆఫీసులు, ఇతర పనుల మీద బయటకు వెళ్లే వారు ఈ పొగమంచులోనే గజగజ వణుకుతూ వెళ్తున్నారు.

Flights Diverted From Shamshabad Airport : పొగ మంచుతో ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులే కుండా విమాన రాకపోకలకూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ దృష్ట్యా శంషాబాద్​లోని పొగమంచు కారణంగా, ఎయిర్​పోర్టుకు రావాల్సిన 30 విమానాలను అధికారులు దారి మళ్లించారు. శంషాబాద్‌లో దిగాల్సిన 3 విమానాలు గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. చండీగఢ్‌, గోవా, తిరువనంతపురం నుంచి ఈ మూడు వచ్చాయి. అదే విధంగా బెంగళూరు-హైదరాబాద్‌ విమానం తిరిగి బెంగళూరుకు పంపారు.

మంచు తుపాను బీభత్సం.. స్తంభించిన రవాణా, విమానాలు రద్దు

మరోవైపు ముంబయి-హైదరాబాద్‌ విమానం తిరిగి ముంబయికి పంపించారు. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్​కు రావాల్సిన విమానాలను ఇతర ఎయిర్​పోర్టులకు మళ్లిస్తున్నారు. ఎయిర్ ఇండియా, విస్తారా, స్పైస్‌ జెట్‌, స్టార్‌ అలయన్స్‌, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాల అధికారులు మళ్లించారు. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని విమానయాన అధికారులు చెబుతున్నారు. మరోవైపు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.

ఓ వైపు చలి.. మరో వైపు పొగమంచు.. జర జాగ్రత్త సుమా..!

Telangana Records Lowest Temparature : మరోవైపు రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా పలు జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు మంచు దుప్పటిలా కమ్మేస్తుంది. విపరీతంగా పడుతున్న మంచు వల్ల రహదారులన్నీ మంచుతో కమ్మేస్తున్నాయి. చలి తీవ్రత బాగా పెరగడంతో వృద్ధులు, చిన్నారులు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ పొగతో కనిపించక వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా ఏర్పడుతోంది.

ఇంకా కొన్ని రోజులు చలి తీవ్రత ఇలాగే ఉండవచ్చని, వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలిలో బయట తిరగకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు దట్టంగా ఉన్న ఉన్ని దుస్తులు ధరించాలని ఈ సీజన్​లో వృద్ధులు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రాగల మూడు రోజులు చలి తీవ్రత పెరుగుతుంది

జీతాల కోసం పైలట్ల బంద్​.. నిలిచిన 800 విమానాలు.. దిల్లీలో ప్రయాణికుల తిప్పలు

Last Updated :Dec 25, 2023, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details