తెలంగాణ

telangana

పక్షిని ఢీకొట్టిన విమానం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

By

Published : Aug 5, 2022, 8:23 PM IST

Vistara Airlines emergency landing

Flight Emergency Landing in Varanasi: వారణాసి నుంచి ముంబయికి వెళ్తున్న విస్తారా యూకే 622 విమానం ఓ పక్షిని ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలట్​.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.

Flight Emergency Landing in Varanasi: ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలో విమానం అత్యవసరంగా ల్యాండ్​ అయ్యింది. వారణాసి నుంచి ముంబయికి వెళ్తున్న విస్తారా యూకే 622 విమానం ఓ పక్షిని ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలట్​ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం విమానాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. రన్​వేపై పూర్తిగా తనిఖీలు చేశామని పక్షికి సంబంధించిన అవశేషాలు లభించలేదని డైరెక్టర్​ ఆర్యమ సన్యాల్ తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు.

"విస్తారా యూకే 622 విమానం సాయత్రం 4:11 గంటలకు వారణాసి నుంచి ముంబయికి బయలుదేరింది. టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే విమానం పక్షిని ఢీకొట్టిందని పైలట్​ సమాచారం ఇచ్చాడు. ఏటీసీని సంప్రదించి ల్యాండింగ్ అనుమతిని కోరాడు. సాయంత్రం 4:40గంటలకు వారణాసిలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది."

ABOUT THE AUTHOR

...view details