తెలంగాణ

telangana

ఈ-బైక్​లో మంటలు.. ఇంట్లోని సామగ్రి దగ్ధం.. లక్షల్లో నష్టం

By

Published : Mar 29, 2022, 1:40 PM IST

e bike fire accident: ఇంటి ముందు పార్క్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్​లో మంటలు చెలరేగాయి. స్కూటర్ కాలిపోవడమే కాకుండా ఇంట్లోని ఇతర విలువైన సామగ్రి సైతం అగ్నికి ఆహుతైంది. స్కూటర్ కాకుండా మరో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.

Electric scooter catches fire
Electric scooter catches fire

e bike fire accident:ఎలక్ట్రిక్ బైక్​లలో మంటలు చెలరేగుతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఇటీవల తమిళనాడులో ఈ-బైక్​లో మంటలు వ్యాపించి ఇద్దరు మరణించారు. ఈ ఘటన మరవకముందే అదే రాష్ట్రంలోని తిరువళ్లూరులో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలిపోయింది. ఇంటి ముందు బైక్​ను నిలిపి ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

కాలిపోయిన బైక్ ఇదే..

Electric scooter fire:నరసింగపురంలో నివసించే దేవరాజ్ అనే రైతు ఇంట్లో ఈ ఘటన జరిగింది. దేవరాజ్ ఈప్లస్టో7జీ అనే ఎలక్ట్రిక్ బైక్​ను ఏడు నెలల క్రితం కొనుగోలు చేశాడు. రూ.90 వేలకు బైక్​ను కొన్నాడు. పక్క ఊరికి వెళ్లి వచ్చిన ఆయన.. రోజూలాగే తన బైక్​ను ఇంటి ముందు పార్క్ చేశాడు. అయితే, మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా స్కూటర్​లో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన దేవరాజ్ కుమారుడు గట్టిగా కేకలు వేశాడు.

ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసం..
.

మంటల ధాటికి స్కూటర్ పూర్తిగా కాలిపోయింది. దాంతో పాటు పక్కనే ఉన్న ఓ బైక్ సహా ఇతర పరికరాలు సైతం దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళాలకు సమాచారం అందించారు. వెంటనే వచ్చి మంటలను ఆర్పేశారు ఫైర్ సిబ్బంది. అయితే, అప్పటికే ప్రధాన ఉపకరణాలన్నీ కాలిపోయాయి. ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్, మోటర్ పంపులు సహా రూ.3 లక్షల విలువైన సామగ్రి బూడిదైందని తెలుస్తోంది.

మంటలు అంటుకొని కాలిపోయిన మరో బైక్
కాలిపోయిన ఏసీ

ఇదీ చదవండి:'ఈ-బైక్'​లో మంటలు.. ఊపిరాడక తండ్రీకూతురు మృతి!

ABOUT THE AUTHOR

...view details