'ఈ-బైక్'​లో మంటలు.. ఊపిరాడక తండ్రీకూతురు మృతి!

author img

By

Published : Mar 26, 2022, 3:48 PM IST

electric bike catches fire
ఛార్జింగ్​ చేస్తుండగా 'ఈ-బైక్'​లో మంటలు ()

Electric bike catches fire: విద్యుత్తు వాహనాలు ఛార్జింగ్​ చేస్తుండగా మంటలు అలుముకుంటున్న సంఘటనలు ఇటీవల పెరిగాయి. అలాంటి సంఘటనే తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. ఈ-బైక్​లో మంటలు చెలరేగి.. వెలువడిన పొగ కారణంగా ఊపిరాడక తండ్రీకూతురు మృతి చెందారు.

Electric bike catches fire: ఎలక్ట్రిక్​ బైక్​ ఛార్జింగ్​ చేస్తుండగా మంటలు చెలరేగి వెలువడిన పొగతో ఊపిరాడక తండ్రీకూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన తమిళనాడు, వెల్లూరు జిల్లాలోని చిన్న అల్లాపురమ్​లో శనివారం రాత్రి జరిగింది. బాధితులు దురయ్​ వర్మ(49), ఆయన కుమార్తె మోహన ప్రీతి(13).. మూత్రశాలలో విగతజీవులుగా కనిపించారని పోలీసులు తెలిపారు.

electric bike catches fire
మంటల్లో దగ్ధమైన ఈ-బైక్​

దురయ్​వర్మ చిన్న అల్లాపురమ్​లో వీడియోగ్రాఫర్​. మూడు రోజుల క్రితం ఒకినావా ఓఖి ఈ-స్కూటర్​ను కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లి శనివారం రాత్రి ఛార్జింగ్​ పెట్టారు. ఈ క్రమంలోనే ద్విచక్రవాహనంలో మంటలు అంటుకున్నాయి. దాంతో వెలువడిన పొగ హాలు మొత్తం వ్యాపించింది. బైక్​లో మంటలు రావటం, పొగ కారణంగా ఇంట్లోంచి బయటకు వచ్చే వీలులేకుండా పోయింది.

electric bike catches fire
ప్రాణాలు కోల్పోయిన తండ్రీకూతురు

మంటలు, పొగను గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఇంట్లోని టాయిలెట్​ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

electric bike catches fire
బైక్​ డెలివరీ తీసుకుంటున్న దురయ్​ వర్మ(పాత చిత్రం)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.