ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఓ ప్లంబర్ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడయ్యాడు. అంతా క్రికెట్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11 మాయ. అక్టోబర్ 10న.. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్పై బెట్ వేయగా.. అదృష్టం అతడి తలుపుతట్టింది. ఏకంగా.. కోటి రూపాయల ప్రైజ్ మనీ గెల్చుకున్నాడు. అతడే బిహార్ కటిహార్ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్.
బబ్లూ.. హంస్వర్ గ్రామంలో ప్లంబింగ్ పనులు చేసేవాడు. ఈ క్రమంలోనే తనతో పనిచేసే మరో వ్యక్తి ద్వారా డ్రీమ్ 11 గురించి తెలుసుకున్నాడు. కొద్దిరోజుల్లోనే అదృష్టం వరించింది. డ్రీమ్ 11 బృందం.. తనకు అభినందనలు కూడా తెలిపిందని పేర్కొన్నాడు బబ్లూ. ఈ డబ్బుతో మొదట మంచి ఇల్లు కట్టుకుంటానని అంటున్నాడు. మరికొంత ధనాన్ని ఓ దేవాలయానికి విరాళంగా ఇస్తానని చెప్పాడు.