తెలంగాణ

telangana

ఆ గుడిలో మహాత్ముడికి నిత్యపూజలు!

By

Published : Jan 30, 2021, 7:38 AM IST

కరెన్సీ నోటు మీద, ఇలా నడిరోడ్డు మీద.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ అన్నాడో సినీకవి. గాంధీజీ పాటించిన సిద్దాంతాలు, ఆయన చూపించిన శాంతిమార్గంపై గౌరవంతో గుడిలో పెట్టి పూజిస్తున్నారు కర్ణాటకలోని ఓ గ్రామవాసులు. ఊర్లో ఏ తగాదా తలెత్తినా.. గాంధీజీ ఎదుటగా ఆ సమస్య సద్దుమణగాల్సిందే. ఇంతకీ గాంధీకి గుడికట్టిన ఆ ఊరేది? దాని విశిష్ఠతలేంటో ఓ సారి చూద్దాం...

MAHATMA GANDHI TEMPLE AT YADGIR DISTRICT IN KARNATAKA
నిత్యపూజలు జరిగే 'మహాత్మాగాంధీ' గుడి!

యాద్​గిర్​ జిల్లాలోని మహాత్మాగాంధీ ఆలయం

జాతిపిత మహాత్మాగాంధీ గుడి ఇది. ఆయనకు నిత్యం పూజలు జరిగే చోటిది. యాద్​గిర్​ జిల్లాలోని బాలశెట్టిహాల్ గ్రామంలో ఉందీ ఆలయం. గాంధీజీ గౌరవార్థం హంపన్న సహూకార్.. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 1948లో ఈ గుడి నిర్మించారు. 70 ఏళ్లుగా ఈ గుళ్లో గాంధీజీకి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు గ్రామస్థులు.

"దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కర్ణాటకలో గాంధీజీ గుడి నిర్మితమైంది. మాజీ టీడీబీ సభ్యుడు హంపన్న సహూకార్ తన పదవీకాలంలో గుడి కట్టించి విగ్రహం ప్రతిష్ఠించారు."

- మనోహర్, గ్రామస్థుడు

పరిష్కార వేదికగా..

గాంధీజీ విగ్రహానికి గ్రామస్థులు నిత్యం పూజలు నిర్వహిస్తారు. ప్రజల మధ్య విభేదాలు తలెత్తినా ఈ ఆలయం వేదికగానే పరిష్కరించుకుంటారు. 68ఏళ్ల తర్వాత ఊరి ప్రజలంతా కలిసి ఆలయ పునరుద్ధరణ చేపట్టారు. గాంధీజీ గుడిని మరింత సుందరంగా మలచుకున్నారు.

"స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సహా.. ఇతర జాతీయ పండుగలప్పుడు ఇక్కడ సంబురాలు చేస్తాం. ఏ పండగ జరిగినా గ్రామస్థులంతా వచ్చి గాంధీజీకి పూజలు చేస్తారు."

- మల్లికార్జున క్రాంతి, సామాజిక కార్యకర్త

ఆదర్శంగా..

తమ ఊర్లో గాంధీకి గుడి ఉండడం గర్వకారణమంటున్నారు ఊరిప్రజలు. పోర్బందర్​లో గాంధీ గుడి నిర్మాణం జరిగిన తర్వాత ఈ గుడి కట్టినట్లు చెబుతారు.

మహాత్మాగాంధీ సిద్దాంతాలను ఊరిప్రజలు తప్పకుండా పాటిస్తారు. ప్రత్యేక శ్రద్ధతో పూజలు నిర్వహిస్తారు. గాంధీజీకి వీళ్లు చేసే పూజలు ఇతరుల్లో దేశభక్తి, స్ఫూర్తిని నింపుతున్నాయి.

ఇదీ చదవండి:ఆ అమ్మవారికి 'రాళ్లే' నైవేద్యం!

ABOUT THE AUTHOR

...view details