భారత్-చైనా సరిహద్దుల్లో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. రఫేల్ యుద్ధ విమానాలు లద్ధాఖ్లోని చైనా సరిహద్దుల వెంట చక్కర్లు కొట్టాయి. భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రఫెల్ యుద్ధ విమానాలు.. వాస్తవాధీన రేఖ వెంట ఎగురుతున్న వీడియోను ఒకదాన్ని రక్షణ వర్గాలు విడుదల చేశాయి. లద్ధాఖ్లోని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా చేసేందుకు ఇలా రఫేల్ ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం.