తెలంగాణ

telangana

'తీవ్రవాదుల బెదిరింపులు కొత్తేమీ కాదు'

By

Published : Jul 12, 2019, 5:29 AM IST

భారత్​లో సమస్యలు సృష్టించాలని పేర్కొంటూ ఆల్​ఖైదా అధినేత అయమాన్​ అల్​ జవహిరి విడుదల చేసిన వీడియోపై భారత్​ స్పందించింది. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి భారత భద్రతా బలగాలు పూర్తి సామర్థ్యంతో ఉన్నాయని పేర్కొంది. బెదిరింపులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని  పేర్కొంది.

'తీవ్రవాదుల బెదిరింపులు కొత్తేమీ కాదు'

కశ్మీర్​పై అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్​ఖైదా నాయకుడు అయమాన్​ అల్​ జవహిరి చేసిన బెదిరింపులు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది​. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కపాడుకునే శక్తి సామర్థ్యాలు భారత బలగాలకు ఉన్నాయని పేర్కొంది.

కశ్మీర్​పై ఇలాంటి బెదిరింపులు కొత్తేంకాదని పేర్కొన్నారు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్​​ కుమార్​.

మాట్లాడుతున్న విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్​ కుమార్​

"ఇలాంటి బెదిరింపులు వింటూనే ఉన్నాం. బెదిరిపులు రావటం ఇదే మొదటిసారి కాదు. దానిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ఆల్​ఖైదా అనేది ఐక్యరాజ్య సమితి గుర్తించిన తీవ్రవాద సంస్థ. దాని నాయకుడు ఐరాస నిర్దేశిత ఉగ్రవాది. మన భద్రత బలగాలు తగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాయి. ఇలాంటి బెదిరింపులకు బయపడాల్సిన పనిలేదు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని రక్షించే సామర్థ్యం వాటికి (సైన్యానికి) ఉంది."

- రవీశ్​ కుమార్​, విదేశాంగ శాఖ ప్రతినిధి.

భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా సైన్యంపై దాడులు చేయాలని కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పిలుపునిస్తూ ఆల్​ఖైదా ఇటీవలే ఓ వీడియో విడుదల చేసింది. కశ్మీరులో సైన్యం, ప్రభుత్వంపై దాడులు చేయడమే ధ్యేయంగా సాయుధ ఉగ్రవాదులు పూర్తిగా దృష్టి సారించాలని ఆల్​ఖైదా నాయకుడు పేర్కొన్నాడు. ఈ భీకర దాడులతో భారత్​లో ఆర్థిక, ప్రాణ, ఆయుధ నష్టం జరగేలా నిరంతరం సమస్యలు సృష్టించాలని సూచించాడు.

ఇదీ చూడండి: వైరల్​: తుపాకీలో తూటాలు ఇలా నింపాలిరా చిన్నా

ABOUT THE AUTHOR

...view details