తెలంగాణ

telangana

అలా ఏటా 100 ఏనుగులు, 500 మంది మనుషులు మృతి

By

Published : Aug 10, 2020, 5:58 PM IST

ఏనుగల దాడిలో మనుషులు, మనుషుల దాడిలో ఏనుగులు ప్రాణాలు కోల్పోయిన వార్తలు ఇటీవల తరచుగా వింటున్నాం. ఏటా ఇలాంటి ఘటనల్లో వందకుపైగా గజరాజులు, 500 మందికిపైగా మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

elephants die every year due to conflict
ప్రతి ఏటా 100 ఏనుగులు, 500ల మందికిపైగా మృతి!

మనుషులు-ఏనుగుల మధ్య ఘర్షణలో ఏటా వందకుపైగా గజరాజులు, 500 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది కేంద్ర పర్యావరణ శాఖ. ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ గణాంకాలు విడుదల చేసింది.

ఏనుగులు- మనుషుల ఘర్షణలను తగ్గించే ఉత్తమ పద్ధతులపై పుస్తకాన్ని విడుదల చేశారు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. జాతీయ స్థాయిలో వెబ్​ పోర్టల్​ను ప్రారంభించారు. ఏనుగులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

పుస్తకం విడుదల చేస్తోన్న జావడేకర్​

" ఏనుగులు-మనుషుల మధ్య ఘర్షణ తీవ్రమైన సమస్య. గజరాజులను సంరక్షించటం చాలా అవసరం. దాంతో పర్యావరణ వ్యవస్థ సమతుల్యమవుతుంది. ఏనుగులను అడవులలోనే ఉంచాలి. దాని కోసం పశుగ్రాసం, నీటి లభ్యతకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాం. వచ్చే ఏడాది నాటికి ఈ కార్యక్రమం ఫలితాలు అందుతాయి."

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి.

కేరళ ఘటనను ఖండించిన మంత్రి..

మే 27న కేరళలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు పేలుడు పదార్థాలను తిని మృతి చెందిన ఘటనను తీవ్రంగా ఖండించారు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్​ సుప్రియో. 'ఏనుగులను రక్షించుకోవాలి. కేరళ ఘటన అమానవీయం, అలాంటి నేరాలను సహించబోం. దోషులను కఠినంగా శిక్షించాలి' అని అన్నారు.

30 శాతం బడ్జెట్​ పెంపు..

దేశంలోని ఏనుగులను సంరక్షించేందుకు గత ఐదేళ్లుగా పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోందన్నారు అదనపు డైరెక్టర్​ జనరల్​ (అటవీ) సౌమిత్ర దాస్​గుప్తా. మరిన్ని ఏనుగుల కారిడార్లను గుర్తించినట్లు చెప్పారు. గజరాజుల సంరక్షణ కోసం బడ్జెట్​ను 30 శాతం పెంచటం సహా పలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

2017లో నిర్వహించిన ఏనుగుల గణన ప్రకారం దేశంలో 30 వేలు గజరాజులు ఉన్నాయి.

ఇదీ చూడండి:క్షుల కోసం మూడెకరాల్లో జొన్న పంట!

ABOUT THE AUTHOR

...view details