తెలంగాణ

telangana

రాజపక్సతో భేటీకి ముందు మోదీ కీలక వ్యాఖ్యలు

By

Published : Sep 24, 2020, 10:29 AM IST

కరోనా అనంతర కాలంలో భారత్, శ్రీలంక మధ్య సహకారం మరింత పెరగాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో భేటీకి ముందు ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.

modi rajapaksa
మోదీ రాజపక్స

శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో భేటీకి ముందు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్ష కోసం ఎదురుచూస్తున్నాని తెలిపారు.

కరోనా అనంతర కాలంలో ఇరు దేశాలు సహకారాన్ని మరింతగా పెంచుకునే మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఇరుదేశాధినేతల భేటీకి సంబంధించి రాజపక్స చేసిన ట్వీట్​పై ఈ విధంగా స్పందించారు మోదీ.

"ప్రధాని మోదీతో సెప్టెంబర్​ 26న జరిగే వర్చువల్​ భేటీ కోసం ఎదురుచూస్తున్నా. రాజకీయ, ఆర్థిక, రక్షణ, పర్యటక రంగాలతో పాటు ఇతర ద్వైపాక్షిక ప్రయోజనాలపై సమీక్ష జరగాలని ఆకాంక్షిస్తున్నా"నని రాజపక్స ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి:సరిహద్దుల్లో వంతెనలను ప్రారంభించనున్న రాజ్​నాథ్​

ABOUT THE AUTHOR

...view details