తెలంగాణ

telangana

'డబ్ల్యూటీఓ వల్లే సాగు చట్టాలు- ఇలా అయితే కష్టమే'

By

Published : Dec 1, 2020, 5:40 PM IST

ప్రపంచ వాణిజ్య సంస్థతో భారత్​కు కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను తీసుకొచ్చిందని వ్యవసాయ నిపుణులు జేఎస్​ టూర్​ అభిప్రాయపడ్డారు. కేంద్రం పక్కా ప్రణాళికను అమలు చేసిందన్నారు. కనీస మద్దతు ధరను చట్టాల్లో చేర్చాలని.. లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని స్పష్టం చేశారు.

Government brought agricultural laws after agreement with WTO: Expert
'డబ్ల్యూటీఓతో ఒప్పందంతోనే నూతన సాగు చట్టాలు'

టూర్​తో ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూ

దేశ రాజధాని దిల్లీలో రైతుల నిరసనలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఈ తరుణంలో హరియాణాలోని వ్యవసాయ నిపుణులు జేఎస్​ టూర్​ను ఈటీవీ-భారత్​ సంప్రదించింది. రైతులు కన్నెర్ర చేసిన నూతన వ్యవసాయ చట్టాలపై టూర్​తో చర్చించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

'డబ్ల్యూటీఓతో భారత్​ ఒప్పందం..'

నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకొచ్చింది. అందుకు ముందుగానే.. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)తో భారత్​ ఒప్పందం కుదుర్చుకుంది. ఏ దేశం కూడా తమ రైతుల ఉత్పత్తులో 10శాతం మించి కొనుగోలు చేయకూడదని ఆ ఒప్పందం సూచిస్తోంది. ఇందుకు అనుగుణంగానే కేంద్రం ఈ నూతన సాగు చట్టాలను తీసుకొచ్చింది.

'ప్రైవేటు వ్యక్తుల ఇష్టారాజ్యమే'

నూతన చట్టాల్లో కనీస మద్దతు ధర ప్రస్తావనే లేదు. ఇందువల్ల ప్రైవేటు వ్యక్తులు మార్కెట్​లోకి వస్తారు. తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తారు.

ఇదీ చూడండి-కర్షక పోరు: ఈ ఐదు ప్రశ్నలకు బదులేది?

'ఎఫ్​సీఐకి స్వస్తి'

దేశంలో రైతుల పంటలను కొనుగోలు చేసే వాటిని నిల్వ ఉంచేందుకు ఎఫ్​సీఐ(ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా)ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కొత్త చట్టాల్లో ఎఫ్​సీఐ, ప్రభుత్వ ఏజెన్సీలను చేర్చలేదు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే ఎఫ్​సీఐకి ప్రభుత్వం స్వస్తి పలుకుతుందేమో! అదే జరిగితే పంట ధరలు చాలా ప్రభావితమవుతాయి.

తమ పంటలను అమ్ముకునేందుకు రైతులు ఇతర రాష్ట్రాలకు ఎలా వెళ్లగలరు? రవాణాకు వారి వద్ద సదుపాయాలు ఉండవు. కనీస మద్దతు ధరను ప్రభుత్వం చట్టాల్లో చేర్చాలి. అంతేకానీ నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకోవడం సరికాదు.

ఇదీ చూడండి:-కొత్త వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు ముప్పు

ABOUT THE AUTHOR

...view details