తెలంగాణ

telangana

'మహా' ప్రభుత్వంపై ఠాక్రే- పవార్​ కీలక భేటీ

By

Published : May 26, 2020, 12:32 PM IST

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు దాదాపు 90 నిమిషాల పాటు సమావేశమైనట్లు శివసేన నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. ప్రభుత్వ స్థిరత్వంపై కొందరు అసత్యాలు ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో వీరి భేటీతో మహావికాస్ అఘాడీ బలంగా ఉందని స్పష్టమైనట్లు పునరుద్ఘాటించారు రౌత్​.

CM Thackeray meets Pawar, Sena says Maha govt strong
మహా ప్రభుత్వంపై ఉద్ధవ్​ ఠాక్రే-శరద్ పవార్​ కీలక భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో భేటీ అయినట్లు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ తెలిపారు. ఈ సమావేశం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వంపై వస్తున్న ఊహాగానాలకు ఇరువురు నేతలు తెరదించారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వం బలంగా ఉందని పునరుద్ఘాటించారు సంజయ్ రౌత్.. కొందరు కావాలనే ప్రభుత్వ మనుగడపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు​. అయితే భేటీ ఎందుకు జరిగిందనేది ఆయన వెల్లడించలేదు.

దేవేంద్ర ఫడణవీస్​ ఫిర్యాదు

ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌.. గవర్నర్‌ కోశ్యారీని కలిసిన అనంతరం ఈ భేటీ జరగడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పరిపాలనలో గవర్నర్ కోశ్యారీ జోక్యం పట్ల శరద్ పవార్ ఇదివరకే బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆహ్వానం మేరకే, శరద్ పవార్​ రాజ్‌భవన్‌ వెళ్లారని.. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని ఎన్​సీపీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు కొవిడ్-19 నివారణలో ప్రభుత్వం విఫలమైందని భాజపా నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి : మనుషులపై అమెరికా సంస్థ కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​

ABOUT THE AUTHOR

...view details