భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే క్రికెట్ ఆడారు. మహారాష్ట్రలోని ఆయన స్వస్థలం నాగ్పుర్లో లాయర్ల జట్టు, జడ్జీల జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైదానంలోకి దిగి కాసేపు బ్యాటింగ్ చేశారు. అనంతరం ఆయనకు నాగ్పుర్తో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
క్రికెట్తో అలరించిన భారత ప్రధాన న్యాయమూర్తి
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే మహారాష్ట్ర క్రికెట్ మైదానంలో బ్యాట్ పట్టి అలరించారు. అనంతరం ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను 'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు.
"న్యాయమూర్తులు, న్యాయవాదులతో కలిసి ఈ మైదానంలో క్రికెట్ ఆడడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాకు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. న్యూజిలాండ్, వెస్టిండీస్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు చూసిన జ్ఞాపకాలున్నాయి. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. పరిసరాలు చాలా మారిపోయాయి కానీ, కొన్ని అలాగే ఉన్నాయి."
-జస్టిస్ శరద్ బోబ్డే, సీజేఐ
ఇదీ చదవండి:'ఉరిమి' ఖడ్గ విద్యలో కేరళ యువకుడి ప్రపంచ రికార్డ్
Tumakuru (karnataka): Maninder Jeet Singh Bitta, President of Central Resistance Force Received a felicitation in Sri Sivakumara Swamiji's First Commemoration Ceremony at Siddadaganga Monastery in Tumakuru. His Chitchat with Etv bharat is here....
Conclusion: