తెలంగాణ

telangana

చుట్టూ మంటలు- మధ్యలో ఒంటికాలిపై ఎంపీ

By

Published : Jun 21, 2020, 5:01 PM IST

BJP MP Jaunapuria Performs Yoga In Ring Of Fire on  International Yoga Day in tonk, sawai madhopur

చుట్టూ భగభగ మండే అగ్ని వలయాలు.. మధ్యలో ఒంటి కాలుపై తపస్సు చేసే మునులు, రుషులను సినిమాల్లో చూసుంటాం. కానీ, రాజస్థాన్​లో ఓ భాజపా పార్లమెంట్​ సభ్యుడు.. ఇంచుమించు ఇలాంటి సాధనే చేశారు. మండుటెండలో.. జ్వాలా వలయంలో నిలబడి యువతకు ఓ సందేశమిచ్చారు. ఏంటిదీ అంటారా? అయితే పూర్తి కథనం చదివేయండి...

విశ్వ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్థాన్​లో ఓ భాజపా పార్లమెంట్​ సభ్యుడు అగ్ని యోగా సాధన చేశారు. ఓ పక్క ఎండ మండిపోతున్నా.. అగ్నివలయం నుంచి కదలలేదు ఆ ఎంపీ. అంతే కాదు... ఒళ్లంతా బురద పూసుకుని బురద స్నానం ఆచరించారు. జిమ్​లో వ్యాయామం చేసి ప్రజలకు ఫిట్​నెస్​పై అవగాహన కల్పించారు.

చుట్టూ మంటలు- మధ్యలో ఒంటికాలిపై పార్లమెంట్​ సభ్యుడు

టోంక్ జిల్లా,​ సవాయ్​ మాధోపుర్ నియోజకవర్గం ఎంపీ సుఖ్​బీర్​ సింగ్​ జోనాపురియా.. రోజుకు దాదాపు 4 గంటల పాటు వ్యాయామం​, యోగా చేస్తారు. ఇలా చేసి కేవలం నాలుగు నెలల్లో దాదాపు 25 కిలోలు బరువు తగ్గారు. అందుకే, ఆయన పాటించిన ఫిట్​నెస్​ మంత్రాను ఈ తరం యువకులూ పాటించాలంటున్నారు. మనకంటూ మనం రోజుకో రెండు గంటల సమయాన్ని కేటాయించుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అగ్ని యోగా సాధన చేస్తున్న ఎంపీ
బురద స్నానం చేస్తూ...

ఇదీ చదవండి:'రాహుల్​జీ.. స్పెల్లింగ్​ సరిచూడండి.. పరువుపోతోంది!'

ABOUT THE AUTHOR

...view details