తెలంగాణ

telangana

Bharat Bandh Today: దేశవ్యాప్తంగా ప్రశాంతంగా భారత్​ బంద్​..

By

Published : Sep 27, 2021, 12:54 PM IST

అన్నదాతలు చేపట్టిన భారత్​ బంద్​(bharat bandh news) ప్రభావం ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపిస్తోంది(bharat bandh today). సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నిరసనకారులు రోడ్లు, రైల్వే ట్రాక్​లపై బైఠాయించారు. దీంతో దిల్లీ(delhi bharat bandh news), పంజాబ్​, హరియాణాల్లోని కొన్ని ప్రాంతాల్లో జనజీవనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అటు దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళలో రైతన్నకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. కేరళలో సంపూర్ణ బంద్​ పాటిస్తున్నారు.(farm laws protest)

bharat-bandh
భారత్​ బంద్​

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా(farm laws protest) దేశవ్యాప్తంగా రైతన్నలు పిలుపునిచ్చిన 'భారత్​ బంద్​'(bharat bandh news) ప్రశాంతంగా సాగుతోంది. దిల్లీ, పంజాబ్​, హరియాణాలో బంద్​ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది(bharat bandh today). ఇటు తమిళనాడు, కేరళలోనూ రైతన్నలకు మద్దతుగా నిరసనలు చేపట్టారు. రోడ్లు, రైల్వే ట్రాక్​లపై మద్దతు తెలిపి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ఉత్తర భారతం..

బంద్​ ప్రభావం ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా దిల్లీలో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. బంద్​ కారణంగా దేశ రాజధాని (delhi bharat bandh news) భద్రతా వలయంలోకి జారుకుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిల్లీ- గురుగ్రామ్​ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

స్తంభించిన దిల్లీ

తెల్లవారుజాము 4గంటల నుంచే.. రహదారులపైకి చేరిన అన్నదాతలు కేంద్రానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని విప్పారు. దిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపుర్‌ లోనూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. కొత్త సాగు చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సింఘూ సరిహద్దులో

పంజాబ్‌-హరియాణా సరిహద్దు ప్రాంతమైన షంభూ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న రైతులు.. అక్కడి జాతీయ రహదారిని దిగ్భందించారు. వాహనాలు వెళ్లేందుకు అన్నదాతలు అనుమతించటకపోవడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హరియాణా రోహ్‌తక్‌, కర్నాల్‌ ప్రాంతాల్లోనూ నిరసనకు చేపట్టిన రైతన్నలు.. రహదారిపై ట్రక్కు, ద్విచక్ర వాహనాలను నిలిపి రాకపోకలను అడ్డుకున్నారు. అటు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రైతన్నలు ఆందోళనకు దిగారు.

మరోవైపు రైతులు రైల్వే ట్రాక్​లపై బైఠాయించి తమ నిరసనలు తెలిపారు. దీంతో దిల్లీ, అమృతసర్​, అంబాలా, ఫిరోజ్​పుర్​ డివిజన్లలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా వారు చేసిన నినాదాలతో ఆయా ప్రాంతాలు మారుమోగిపోయాయి. మొత్తం మీద ఇప్పటివరకు 25రైళ్లపై బంద్​ ప్రభావం పడినట్టు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

పంజాబ్​ అమృత్​సర్​లో..

దక్షిణాది రాష్ట్రాల్లోనూ..

రైతులు చేపట్టిన భారత్​ బంద్​.. తమిళనాడులో(tamil nadu bharat bandh) ఉద్రిక్తతకు దారితీసింది. చెన్నైలోని అన్నా సలై ప్రాంతంలో నిరసనకు దిగిన ఆందోళనకారులు.. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నంలో పోలీసులు- నిరనసకారుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రైతు నిరసనలకు, భారత్​ బంద్​కు కేరళ ప్రభుత్వం(kerala bharat bandh 2021) సంపూర్ణ మద్దతు ప్రకటించడం వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. తిరువనంతపురం సహా ప్రధాన నగరాల్లో దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో రోడ్లన్నీ ఎడారిని తలపిస్తున్నాయి.

కేరళ తిరువనంతపురంలో సంపూర్ణ బంద్​

కర్ణాటకలో మాత్రం భారత్​ బంద్​ ప్రభావం కనిపించడం లేదు. అన్ని కార్యకలాపాలు ఎప్పటిలాగానే సాగుతున్నాయి. దుకాణాలు, ప్రజా రవాణా, ఆఫీసులన్నీ పనిచేస్తున్నాయి. అయితే బెంగళూరులో బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు నిరసనకారులు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగినా, ప్రజా వ్యవస్థలను ధ్వంసం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

కర్ణాటకలో నిరసనలు

సాయంత్రం 4 గంటల వరకు బంద్​ కొనసాగనుంది.

రాహుల్​ మద్దతు..

సాగు చట్టాలకు నిరసనగా రైతు నేతలు చేపట్టిన భారత్​ బంద్​కు (Bharat bandh today) కాంగ్రెస్​ సీనియర్​​ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. రైతులు శాంతియుతంగా చేపడుతున్న నిరసనలకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే వారు ఈ విధంగా బంద్​ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం (Rahul Gandhi Twitter) ట్వీట్​ చేశారు.

'చర్చకు రండి...'

దేశవ్యాప్తంగా భారత్​ బంద్​ కొనసాగుతున్న నేపథ్యంలో మాట్లాడిన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. రైతులు ఆందోళనను వీడి.. చర్చలకు రావాలన్నారు. అన్నదాతలు లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గ్వాలియర్​లోని వ్యవసాయ కళాశాలలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రైతులతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపిందని.. భవిష్యత్తులో కూడా చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రైతు ఉద్యమాన్ని రాజకీయం చేయకూదని తోమర్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-farm income: ఛిద్రమవుతున్న శ్రమజీవి బతుకు చిత్రం!

ABOUT THE AUTHOR

...view details