తెలంగాణ

telangana

'అరవణ' ప్రసాదంపై దేవస్థానం కీలక నిర్ణయం- ఇక నుంచి ఒక్కో భక్తుడికి రెండు టిన్​లే!

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 7:47 PM IST

Updated : Jan 5, 2024, 9:11 PM IST

Aravana Prasadam Sabarimala : శబరిమలలో భక్తులకు అందించే పవిత్ర 'అరవణ' ప్రసాదంపై ఆంక్షలు విధించింది ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు. ఒక్కో భక్తుడికి 2టిన్​లు మాత్రమే అందిస్తామని తెలిపింది.

Aravana Prasadam Sabarimala
Aravana Prasadam Sabarimala

Aravana Prasadam Sabarimala :శబరిమల అయ్యప్ప స్వామి 'అరవణ' ప్రసాదంపై ఆంక్షలు విధించింది ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు! ప్రసాదం డబ్బాల కొరత నేపథ్యంలో ఒక భక్తుడికి కేవలం 2 టిన్​లే అందిస్తామని దేవస్థానం బోర్డు పేర్కొంది. కొద్ది రోజుల నుంచి ప్రసాదం కొరత కారణంగా ఒక్కో భక్తుడికి 10 టిన్​లు మాత్రమే అందించేది దేవస్థానం. అయితే మకరజ్యోతి దర్శనానికి ఎక్కువ మంది భక్తులు రానున్న నేపథ్యంలో అరవణ ప్రసాదంపై పరిమితులు విధించింది దేవస్థానం బోర్డు.

ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ప్రసాదం విషయంలో కొత్త ఆంక్షల నేపథ్యంలో స్వల్ప వివాదాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరికి రెండు టిన్నుల అవరణ ప్రసాదం ఇస్తామని నిబంధన పెట్టడం వల్ల క్యూలో భారీగా భక్తులు నిల్చొంటున్నారు.

'డబ్బాల కొరత వల్లే ఈ నిర్ణయం'
అయ్యప్ప ప్రసాదాన్ని నింపేందుకు డబ్బాల కొరత వల్ల ఒక్కో భక్తుడికి రెండు డబ్బాల ప్రసాదాన్ని ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని ట్రావెన్​కోర్ దేవస్థానం అధికారులు తెలిపారు. త్వరలోనే అరవణ ప్రసాదం డబ్బాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గతేడాది 26వ తేదీన 2 కొత్త కంపెనీలకు ప్రసాదం డబ్బాల కాంట్రాక్ట్​ను ఇచ్చింది దేవస్థానం బోర్డు. అయితే అంత మొత్తంలో కంపెనీలో అరవణ ప్రసాదం డబ్బాలను అందించలేకపోయాయి.

Sabarimala Makara Jyothi 2024 Date : మకరజ్యోతి ఉత్సవాల్లో భాగంగా జనవరి 13న ప్రసాద శుద్ ధక్రియ, 14న బింబ శుద్ధ క్రియలను నిర్వహించనున్నట్లు కొద్ది రోజుల క్రితం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది. 15న మకరజ్యోతి వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. భక్తుల కోసం జనవరి 20వ తేదీ వరకు ఆలయం తెరిచే ఉంటుందని పేర్కొంది. అదే రోజున సన్నిధానంలో స్వామివారికి తిరువాభరణం, దీపారాధన ఉంటాయని తెలిపింది. జనవరి 20న పూజల అనంతరం దేవాలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించింది.

Sabarimala News Today : మరోవైపు, మకరజ్యోతి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేసేందుకు 1800 మంది పోలీసులు బాధ్యతలు స్వీకరించారు. ఇందులో సీనియర్​ అధికారులు ఉన్నారు. యాత్రికులతో పోలీసులు మంచిగా ప్రవర్తించాలని, అంకితభావంతో పనిచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కన్నూరు రేంజ్ డీఐజీ థామ్సన్ జోస్ ఆదేశించారు. భక్తులందరికీ దర్శనం సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, యాత్రికుల పట్ల ఓపికగా ఉండాలని సూచించారు.

మండలపూజలు పూర్తి- శబరిమల గుడి మూసివేత- మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే?

అయ్యప్ప దర్శనం కాకుండానే తిరుగుపయనం! శబరిమలలో విపరీతమైన రద్దీతో భక్తుల ఇబ్బందులు

Last Updated :Jan 5, 2024, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details