ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Power Cuts In AP జగనన్న.. ఈ అంధకారం ఏంటన్న! ఎడాపెడా విద్యుత్​ కోతలతో.. అల్లాడుతున్న ప్రజానికం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2023, 7:29 AM IST

Updated : Aug 23, 2023, 8:45 AM IST

Power Cuts In AP: ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల విద్యుత్​ కోతలు తప్పటం లేదు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవటంతో ప్రజలు కరెంట్​ కోతల వెతలు భరించాల్సిన దుస్థితి. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత రాష్ట్రం మళ్లీ విద్యుత్​ కోతలు ప్రారంభయ్యాయి.

Continuous_Power_Cuts_In_AP
Continuous_Power_Cuts_In_AP

Continuous Power Cuts In AP: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు విద్యుత్ చార్జీల వాతలు.. మరోవైపు సమయం, సందర్భం లేకుండా పోతున్న విద్యుత కోతలతో.. సామాన్యులు అల్లాడిపోతున్నారు. వరుసగా రెండో ఏడాదీ విద్యుత్‌ కష్టాలతో.. పల్లెలు, పట్టణాలు గాఢాంధకారంలోనే వెళ్లిపోతున్నాయి. డిమాండ్‌లో అసాధారణ పెరుగుదల లేకున్నా.. రాష్ట్ర ప్రజలకు విద్యుత్​ కోతలు మాత్రం తప్పడం లేదు. రోజువారి విద్యుత్ వినియోగానికి సరిపడా విద్యుత్‌ని కొనుగొలు చేయడంలో ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వ అలాలోచిత చర్యలతో ప్రజలు కరెంట్‌ కోతలతో నానా అగచాట్లు పడుతున్నారు.

రాష్ట్ర విభజన జరిగిన సమయానికి ఏపీలో విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్పత్తి లేక సర్దుబాటు కోసం రోజూ 15 మిలియన్‌ యూనిట్ల మేర.. టీడీపీ సర్కారు కోతలు విధించేది. రాష్ట్రాభివృద్దిలో కీలకమైన విద్యుత్ పై నాటి సీఎం చంద్రబాబు పటిష్టమైన చర్యలకు దిగడంతో.. కేవలం ఐదు నెలల్లోనే విద్యుత్‌ కోతల్లేని రాష్ట్రంగా మార్చేసింది. అటు తరువాత ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే తప్పా.. రాష్ట్రంలో విద్యుత్ కోతలనే మాటా రాలేదు. మళ్లీ ఏడేళ్ల తర్వాత.. గతేడాది నుంచే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు మళ్లీ అనుభవంలోకి వచ్చాయి.

Heavy Power Cuts In Andhra Pradesh: రాష్ట్రంలో అధికమవుతున్న విద్యుత్​ కోతలు.. అంధకారంలో మగ్గుతున్న ప్రజలు

ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోతే ఆ రాష్ట్రాన్ని కరెంటు లేక చీకట్లు కమ్ముకుంటాయని అప్పట్లో అంచనా వేశారు. కానీ, డిమాండ్‌కు సరిపడా విద్యుత్​పై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ.. తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా సరఫరా చేస్తోంది. సాగుకు 24 గంటలు ఉచితంగా అందిస్తోంది. కాని ఇక్కడ మాత్రం వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేడు ఏపీని కరెంటు కష్టాలు చుట్టుముట్టాయి.

సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ కన్న.. మన రాష్ట్రంలోనే విద్యుతుత్పత్తి వనరులు ఎక్కువగా ఉన్నాయి. అయినా రాష్ట్రంలోనే కోతలు విధించాల్సి రావడం.. పక్కగా ముందు చూపు లేకపోవడమేనని తేలిపోతుంది. విద్యుత్ చార్జీలపై ముందుస్తు చూపును ప్రదర్శించిన జగన్ సర్కార్.. ట్రూఅప్, ఇంధన సర్దుబాటు పేర్లతో ఏటా అదనంగా 10 వేల కోట్ల భారాన్ని మోపింది. చార్జీలపై దృష్టి తప్పా.. రాష్ట్రం చీకట్లోకి వెళ్ళిపోతుందనే భావన ప్రభుత్వానికి లేకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

power cuttings in AP : కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో..! రాష్ట్రంలో అనధికారిక విద్యుత్ కోతలు

దక్షిణాదిలో 40.83 శాతం లోటు.. ఏపీలోనే:దక్షిణాది రాష్ట్రాల లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ పరిధిలో ఏపీతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాల గ్రిడ్‌లను ఎస్‌ఎల్‌డీసీ నియంత్రిస్తుంది. ఎస్‌ఎల్‌డీసీ పరిధిలోని రాష్ట్రాల్లో కలిపి సోమవారం 16.85 ఎంయూల విద్యుత్‌ లోటు ఉంది. అందులో 6.88 ఎంయూలు మన రాష్ట్రానికి సంబంధించిందే.

మొత్తం లోటులో 40.83 శాతం ఏపీలోనే ఉంది. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. తెలంగాణలో లోటు 0.28 ఎంయూలు మాత్రమే. అంటే, విద్యుత్​ కోతలు లేకుండానే 234.32 మిలియన్​ యూనిట్ల విద్యుత్‌ను ఆ రాష్ట్రలకు సంబంధించిన డిస్కంలు సర్దుబాటు చేసి అందించాయి.

రాష్ట్రంలో సోమవారం విద్యుత్‌ డిమాండ్‌ 227.05 ఎంయూలుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్పత్తి వనరులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా వచ్చే విద్యుత్‌ పోనూ, బహిరంగ మార్కెట్‌లో 47.59 ఎంయూల వరకు డిస్కంలు కొన్నాయి. అయినా, డిమాండ్‌ మేరకు సరఫరా చేయలేదు.

Huge increase in electricity demand: ఎడాపెడా విద్యుత్ కోతలు.. ప్రభుత్వ వైఫల్యమే: పయ్యావుల

6.88 ఎంయూల విద్యుత్​ కోతను అత్యవసర లోడ్‌ రిలీఫ్‌ పేరుతో విధించారు. అందువల్ల రాష్ట్రంలోని పలు గ్రామాలు, కొన్ని పట్టణాల్లో రాత్రి 7గం. నుంచి సుమారు నాలుగైదు గంటల సమయం పాటు కరెంట్​ కోతలు విధించారు. పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పినందుకు అత్యవసర సమయంలో జాతీయ గ్రిడ్‌ నుంచి 250 మెగావాట్ల విద్యుత్‌ను సర్దుబాటు కింద తీసుకునే వెసులుబాటు కేంద్రం నిర్దేశంతో ఏపీకి లభించింది. ఆ విద్యుత్‌ను రాష్ట్రం ప్రతిరోజు తీసుకుంటున్న కూడా కోతలు తప్పడం లేదు.

విజయవాడ వీటీపీఎస్, ఆర్‌టీపీపీల్లో వార్షిక నిర్వహణ కోసం ఒక్కోటి 210 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లలో ఉత్పత్తి నిలిచింది. వార్షిక నిర్వహణ కోసం ఆగస్టు నుంచి దశల వారీగా థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపేయడం సహజమే. ఎన్‌టీపీసీకి చెందిన తాల్చేరు, సింహాద్రి, కూడ్గి థర్మల్‌ కేంద్రాలను వార్షిక నిర్వహణ కోసం ఆపేయడంతో వాటి నుంచి రావాల్సిన 885 మెగావాట్ల విద్యుత్‌ నిలిచింది. దీనికి ప్రత్యామ్నాయ చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు.

Protest against Power Cuts: విద్యుత్ కోతలతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొందామన్నా దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎక్స్ఛేంజీల నుంచి ఏపీతో సమానంగా కొంటున్నాయి. ఆ రాష్ట్ర సంస్థలకు ఎక్స్ఛేంజీల్లో దొరికినప్పుడు.. మనకు మాత్రమే ఎందుకు దొరకడం లేదు. వర్షాభావంతో శ్రీశైలం వద్ద జల విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉండదని తెలిసి, ఆ మేరకు లోటును పూడ్చుకునే చర్యలు ఎందుకు తీసుకోలేదే అధికారులే చెప్పాలి.

వాతావరణ మార్పులతో పునరుత్పాదక విద్యుత్‌ ప్రభావితం అవుతుంది. కానీ, ఏటా ఆగస్టులో ఈవినింగ్‌ పీక్‌ హవర్స్‌లో పవన విద్యుత్‌ సుమారు 2 వేల మెగావాట్లు వచ్చేదని, ప్రస్తుతం 185 మెగావాట్లకు మించడం లేదని అధికారులు చెబుతున్నారు. కృష్ణపట్నంలో రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా 1,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచింది.

ఏపీలో ఈ స్థాయిలో విద్యుత్ సంక్షోభం ఎందుకొచ్చింది?

ఉమ్మడి విశాఖ జిల్లాలో సెజ్‌ పరిధిలోని పరిశ్రమలకు రాత్రి 8 నుంచి 50 శాతం లోడ్‌ వినియోగించుకునేలా ఆదేశాలిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో ఉదయం 9 నుంచి 4 గంటల పాటు విద్యుత్‌ కోతలు విధించారు. అనకాపల్లిలో ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు లేదు.

పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో రాత్రి 8 నుంచి కోతలు అమలయ్యాయి. పాలకొండ మండలంలోని 15 గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయి.ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, సోంపేట, పాతపట్నం, మోలియపుట్టి, బూర్జ మండలాల్లో సాయంత్రం దశల వారీగా కోతలు విధించారు.

వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి 8 నుంచి గంట పాటు కోతలు విధించారు. గుంటూరు నగరంలో సాయత్రం 4 తర్వాత విద్యుత్‌ సరఫరా నిలిచింది. పల్నాడు జిల్లా బెల్లంకొండ, గురజాల మండలాల్లో మధ్యాహ్నం 3 నుంచే అప్రకటిత కోతలు విధించారు. నూజెండ్ల మండలంలో రెండు గంటల పాటు కోత పెట్టారు.

వేళాపాళా లేని విద్యుత్ కోతలు.. ఉపాధి కోల్పోతున్న కార్మికులు..

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో సాయంత్రం 5 నుంచి సరఫరాలో అంతరాయం ఏర్పడగా, రాత్రి 8 తర్వాత పూర్తిగా నిలిపివేశారు. నగరి నియోజకవర్గంలో రెండు గంటల పాటు కోతలు అమలు చేశారు. పలమనేరు పట్టణంలో రాత్రి 7 నుంచి విద్యుత్‌ లేదు. వి.కోటలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా లేదు.

ప్రకాశం జిల్లా మార్కాపురం, ఎర్రగొండపాలెం సాగు కరెంటులో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కృష్ణా జిల్లా నాగాయలంకలో రాత్రి 8 నుంచి, ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో రాత్రి 9 నుంచి సరఫరా నిలిచిపోయింది. నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, ఏఎస్‌ పేట మండలాల్లోనూ రాత్రి 9 తర్వాత కరెంటు లేదు.

అసలే సర్కారు దవాఖాన.. ఆపై విద్యుత్​ కోతలు.. రోగుల బాధలు వర్ణనాతీతం

గతేడాదితో పోలిస్తే విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరిగిందని, ఆ మేరకు డిమాండ్‌ సర్దుబాటు చేయడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఇది అవాస్తవం. గతేడాది ఆగస్టు 22న విద్యుత్‌ వినియోగం 220.75 ఎంయూలు కాగా, ఈసారి 227.05 ఎంయూలుగా నమోదైంది. కేవలం 6.3 ఎంయూలు పెరిగితేనే అసాధారణమనడం ఎంత వరకు సమంజసం.

ఏటా రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 8 శాతం పెరుగుతుందని అంచనా. ఆ లెక్కన 17.6 ఎంయూల వినియోగం పెరగాలి. స్వల్ప పెరుగుదలకే కోతలు విధిస్తే, అసాధారణంగా పెరిగితే పరిస్థితేంటనే ఆందోళన తలెత్తుతోంది.

విద్యుత్ సరఫరాపైనా బొగ్గు సంక్షోభ ప్రభావం.. ఈపీడీసీఎల్‌ పరిధిలో అనధికార కోతలు

Power Cuts In AP జగనన్న.. ఈ అంధకారం ఏంటన్న!
Last Updated :Aug 23, 2023, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details