- ఎమ్మెల్యే కోటంరెడ్డిపై జగన్ ఆగ్రహం.. సీఎం కార్యాలయం నుంచి పిలుపు
CM Jagan Fires on Kotamreddy Sridhar Reddy: నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల అనేక సమావేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటంరెడ్డి విమర్శలు చేశారు. పింఛన్ల తొలగింపు, మురుగుకాల్వల నిర్వహణ, రాష్ట్రంలోని రహదారుల దుస్థితి, నిధుల కొరతపై పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో తన కార్యక్రమాలను రద్దు చేసుకుని సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలో సీఎంను కలవనున్నారు.
- 'పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాను.. ఇప్పుడు వారిని ప్రోత్సహిస్తున్నారు'
Bellamkonda ZPTC Comments: పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా.. పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రోత్సహిస్తున్నారని వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు ఆరోపించారు. ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వంపై.. బెల్లంకొండ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి.
- ఏలూరు ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్
Arrest of Kotari Adiseshu: రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేపట్టిన హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు వచ్చిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
- 'ప్రభుత్వానికి నూకలు చెల్లాయి.. ఆ పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ తప్పదు'
Chintamaneni Prabhakar : పోలీసులు తనపట్ల దురుసుగా ప్రవర్తించారని టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని హెచ్చరించారు.
- కాలేజ్లో యువతి దారుణ హత్య.. అక్కడికక్కడే మృతి.. ప్రేమే కారణం!
బెంగళూరులోని ఓ కాలేజ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
- న్యూ ఇయర్ వేడుకల్లో పాము కాటుతో వ్యక్తి మృతి.. 'స్పెషల్ గిఫ్ట్' అంటూ అరవడం వల్లే!
నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం సేవించిన ఓ వ్యక్తి.. హల్చల్ చేశాడు. అటుగా వెళ్తున్న ఓ పామును పట్టుకుని న్యూఇయర్ గిఫ్ట్ అంటూ అరిచాడు. రెప్పపాటులో ఆ సర్పం అతడిని కాటువేయగా.. మృతి చెందాడు. తమిళనాడులో జరిగిందీ ఘటన.
- బీచ్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. నలుగురు మృతి
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
- రాష్ట్రంలోని ఎయిపోర్టుల్లో నిలిచిన కార్గో సేవలు.. అనుమతులపై ఆరు నెలల ముందే సూచన
Cargo Services at Airports Have Stopped: విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం సహా దేశంలోని 20 విమానాశ్రయాల్లో సరకు రవాణా సేవలు జనవరి1 నుంచి నిలిచిపోయాయి. అనుమతులను పునరుద్ధరించుకోవాలంటూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆరు నెలల కిందట సూచించినప్పటికీ.. జరగకపోవడంతో తాజాగా సరకు రవాణా సేవలను ఆపేస్తున్నట్టు బీసీఎఎస్ ప్రకటించింది.
- మిషన్ 2024 టార్గెట్.. లంకతో భారత్ ఢీ.. పాండ్య సేన బోణీ కొడుతుందా?
రేపు జరగబోయే భారత్, శ్రీలంక టెస్టు మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సారి సీనియర్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్లో ఏలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఆ వివరాలు..
- ఆడియెన్స్కు బంపర్ ఆఫర్.. ఆ సినిమా చూస్తే లక్ష రూపాయలు.. కానీ!
ఓ మూవీటీమ్ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. తమ సినిమాను థియేటర్కు వెళ్లి చూస్తే లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. దీనికి ఓ కండిషన్ పెట్టింది. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే?