తెలంగాణ

telangana

LIVE : వివేకా హత్య కేసులో అప్రూవర్​గా మారిన దస్తగిరి సంచలన ప్రెస్​మీట్​ - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 4:15 PM IST

Updated : Mar 19, 2024, 4:29 PM IST

YS Vivekananda Reddy murder case approver Dastagiri : వివేకా హత్య కేసులో నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్‌ దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేయరాదన్న బెయిలు షరతును అవినాష్‌రెడ్డి ఉల్లంఘించారని ఆరోపించారు. సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే రూ.20 కోట్లతో పాటు కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలిస్తామన్నట్లు దస్తగిరి సంచనల వ్యాఖ్యలు చేశారు.ఒప్పుకోకపోతే తనతో పాటు కుటుంబసభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన తనకు రక్షణ కల్పించాలంటూ దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్, ఆయన భార్య భారతి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే విషయంపై దస్తగిరి నేడు సంచలన విషయాలు వెల్లడించడానికి అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు.
Last Updated : Mar 19, 2024, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details