తెలంగాణ

telangana

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ రామకృష్ణరావుపై బదిలీ వేటు

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 10:34 PM IST

Yadadri Temple EO Transfer : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ రామకృష్ణరావుపై బదిలీ వేటు పడింది. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం వ్వవహరించారని ఆలయ ఈవోని దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. యాదగిరిగుట్ట కొత్త ఆలయ ఈవోగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Etv Bharat
Etv Bharat

Yadadri Temple EO Transfer :యాదాద్రి ఆలయ ఇన్​ఛార్జ్​ ఈఓ రామకృష్ణపై బదిలీ వేటు పడింది. ఆలయ నూతన ఈవోగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11న యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం సీఎంకు, మంత్రులకు వేద బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం, మిగతా మంత్రుల కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలకు చిన్న పీటలు వేశారు. ఈ విషయంపై వివాదం రాజుకుంది. మంత్రులకు అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై బదిలీకి కారణమని సమాచారం.

యాదాద్రి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు- వటపత్రశాయి అలంకారంలో స్వామివారు

అయితే విపక్షాల ఆరోపణలను మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తానే కావాలని చిన్న పీటపై కూర్చున్నానని తెలిపారు. బదిలీ వేటు పడిన రామకృష్ణరావు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేశారు. మాజీ ఈవో గీతారెడ్డిని తొలగించిన తరువాత ఆయనకు యాదాద్రి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రామకృష్ణరావు స్థానంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావుని ఆలయ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

యాదాద్రి ఆలయంలో కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా : భట్టి

Yadadri News : 2014లో గీతారెడ్డి యాదాద్రి ఆలయ ఈవోగా నియమించగా 2020లో యాదాద్రి ఈవోగా పదవీ విరమణ అనంతరం తిరిగి ప్రభుత్వం గీతారెడ్డినే ఈవోగా కొనసాగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గీతారెడ్డిని రాజీనామా చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో నూతన ఈవోగా రామకృష్ణను ప్రభుత్వం నియమించింది. తాజాగా ఈనెల 11న జరిగిన వివాదంతో ప్రభుత్వం చర్యలకు దిగిందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదు. విపక్షాల ఆరోపణలను ఖండించింది. వివాదం మొదలైన మరుసటి రోజే భట్టి విక్రమార్క స్పందించారు. తాను ఆత్మాభిమానం గల వ్యక్తినని ఆలయంలో ఎలాంటి వివాదం చోటు చేసుకోలేదని వివరణ ఇచ్చారు. అయితే విపక్షాలు మాత్రం దీనిని రాజకీయ అంశంగా మార్చాయి. ఇప్పుడు ఈవోపై బదిలీ వేటు పడటంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సతీసమేతంగా దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

యాదాద్రి ఆలయంలో కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా : భట్టి

ABOUT THE AUTHOR

...view details