ETV Bharat / state

యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా - నూతన ఈవోగా రామకృష్ణ బాధ్యతల స్వీకరణ

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 6:34 PM IST

Ramakrishna Appoint as Yadadri EO
Yadadri Temple EO Geetha Reddy Resigns

Yadadri Temple EO Geetha Reddy Resigns : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండోమెంట్ కమిషనర్ ఆఫీసులో తన రాజీనామా లేఖను సమర్పించారు. మరోవైపు యాదాద్రి ఆలయ నూతన ఈవోగా రామకృష్ణను ప్రభుత్వం నియమించింది.

Yadadri Temple EO Geetha Reddy Resigns : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి(yadadri) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండోమెంట్ కమిషనర్ ఆఫీసులో రాజీనామా లేఖను అందించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల్లో గీతారెడ్డి సుదీర్ఘ కాలం సేవలందించారు. యాదాద్రి ఆలయ ఈవోగా సుమారు 9 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించారు.

ముక్కోటి ఏకాదశికి భద్రాద్రి ముస్తాబు - 23న సీతారాముల వైకుంఠ ద్వార దర్శనం

Yadadri Latest News : 2014లో గీతారెడ్డి యాదాద్రి ఆలయ ఈవోగా నియామకమయ్యారు. 2020లో యాదాద్రి ఈవోగా పదవీ విరమణ అనంతరం తిరిగి ప్రభుత్వం గీతారెడ్డినే ఈవోగా కొనసాగించింది. ఆలయ ఈవోపై స్థానిక ప్రజలు, అధికారుల నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎప్పుడూ పట్టించుకోలేదనే భావన స్థానిక ప్రజల్లో నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత సైతం ఈవో పని తీరుపై పలుసార్లు మాజీ సీఎం కేసీఆర్​కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

స్థానిక భక్తులు రోజువారీ దర్శనానికి కాకుండా, కేవలం శనివారం మాత్రమే దర్శనానికి రావాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. 2020లో ఆలయ ఈవోగా గీతారెడ్డి పదవీ కాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం తిరిగి నియమించడంతో ఇష్టారాజ్యంతో పలు నిబంధనలు విధించి కింది స్థాయి ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఒక దశలో స్థానిక జర్నలిస్టులపై సైతం అనేక ఆంక్షలు విధించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేశారు.

Ramakrishna Appoint as Yadadri EO : మరోవైపు యాదాద్రి ఆలయ నూతన ఈవోగా రామకృష్ణను ప్రభుత్వం నియమించింది. దాంతో నేడు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నెల 23వ తేదీన ఆలయంలో జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Ramakrishna Appoint as Yadadri EO
యాదాద్రి ఆలయ ఈవోగా రామకృష్ణ నియామకం

అసెంబ్లీ సమావేశాలు - జగదీశ్​ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం

తెలంగాణలో రేవంత్​రెడ్డి(cm revanth reddy) సర్కార్ అధికారంలోకి రాగానే పలు కార్పొరేషన్ల అధికారులపై వేటు పడింది. మరికొందరు తమకు తాముగా రాజీనామా లేఖలను సమర్పించారు. తెలంగాణ ట్రాన్స్​ కో, జెన్​ కో సీఎండీ ప్రభాకర్​ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్​, స్పెషల్​ ఇంటెలిజెన్స్​ బ్యూరో ఓఎస్​డీ ప్రభాకర్​ రావు, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సహా మరికొందరు తమ రాజీనామా లేఖలను సీఎస్​​కు పంపించిన సంగతి తెలిసిందే.

విద్యుత్​ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట, గజ్వేల్​ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి : సీఎం రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.