తెలంగాణ

telangana

కన్ను పడిందా కాజేయడం పక్కా - పార్కింగ్ కార్లే టార్గెట్​గా అంతర్​రాష్ట్ర దొంగల చేతివాటం

By ETV Bharat Telangana Team

Published : Feb 29, 2024, 7:19 PM IST

Parked Cars Theft Telangana 2024 : పార్కింగ్​ చేసిన వాహనాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్​రాష్ట్ర దొంగలు అరెస్టు అయ్యారు. ఇవాళ నల్గొండ జిల్లాలోని పోలీసులు రహదారిపై తనిఖీలు నిర్వహించగా, గత కొన్ని రోజుల నుంచి కార్ల దొంగతనాలు చేస్తున్న నిందితులు పట్టుబడ్డారు.

Thief Arrested for Stealing Bikes at Tandur
Two Arrested for Stealing from Parked Cars

పార్కింగ్ చేసిన కార్లలో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అరెస్టు - మరో కేసులో 12 బైకులను దొంగిలించిన వ్యక్తి అరెస్టు

Parked Cars Theft Telangana 2024 :ఆగి ఉన్న వాహనాలే వాళ్ల టార్గెట్. పని మీద పార్కింగ్ చేసి వెళ్లావో అంతే సంగతి. ఆ కేటుగాళ్ల కన్ను పడిందంటే చాలు కార్లలో ఉన్నది ఏదైనా సరే, ఎంతైనా సరే ఇట్టే కొట్టేసి మాయమైపోతారు. వాహనాదారులను ఓ కంట కనిపెడుతూ అనుమానం రాకుండా కారు అద్దాలు పగల గొట్టి అందులో ఉన్న విలువైన పత్రాలు, డబ్బులు, చరవాణులు ఇలా ఏవైనా విలువైన వస్తువులు ఉన్నాయో ఇక అంతే సంగతి. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలనే టార్గెట్​గా చేసుకొని అద్దాలు పగల గొట్టి డబ్బులు దొంగిలించే ఇద్దరు అంతర్​రాష్ట్ర దొంగలను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం : నిందితులు ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాకు చెందిన పిట్ల మహేశ్​(36), ఆవుల రాకేశ్(26) గత కొంత కాలంగా రాష్ట్రంలోని దొంగతనం చేస్తున్నారు. వీరు రోడ్లపైగానీ, బ్యాంకుల ముందుగానీ పార్క్​ చేసిన కార్లను గమనించి ఆ వాహనాల అద్దాలు పగలకొట్టి విలువైన వస్తువులు, నగదును దొంగలిస్తున్నారు.

ఈరోజు ఉదయం బాదలాపురం బస్టాండ్ వద్ద కోదాడ-జడ్చర్ల హైవే(Highway) 167 రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ. 2.77 లక్షలు నగదు, రెండు సెల్​ఫోన్లు, ఒక కారు, ఇతర పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజశేఖర్ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని రూరల్ వన్ టౌన్ పీఎస్​లో నిందితులపైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

'నిందితులు చాలా రోజుల నుంచి రెండు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్నారు. 2023, 2024లో వీరి మీద మిర్యాలగూడలో ఫిర్యాదు వచ్చింది. ఆ కేసులో సుమారు 6 లక్షల నగదు పోయింది. పోలీసులు అందరూ టీమ్​గా ఏర్పడి నిందితులను అరెస్టు చేశాం.'- రాజశేఖర్ రాజ, మిర్యాలగూడ డీఎస్పీ

యువరాజ్ సింగ్​ ఇంట్లో చోరీ - నగలు, డబ్బు మాయం

Thief Arrested for Stealing Bikes at Tandoor : మరోవైపు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన అంతరాష్ట్ర దొంగను వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా కురుకుంటా గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ నిఖిల్ గత నాలుగు నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు గౌతపూర్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ బైక్​పై వచ్చిన నిఖిల్​ను తనిఖీ చేశారు.

ద్విచక్ర వాహన ధ్రువపత్రాలు లేకపోవటంతో పోలీసులకు అతని మీద అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు మొత్తం 12 బైకులను దొంగిలించాడని బయటపడింది. వికారాబాద్, తాండూర్​తో పాటు హైదరాబాద్, లింగంపల్లి, బాలానగర్ ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలను దొంగిలించి, వాటిని తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామంలోని ఓ రైతు పొలంలోని షెడ్లో దాచి పెట్టాడని తాండూర్ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి తెలిపారు. వాహనాలు స్వాధీనం చేసుకుని దొంగను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.

ఇదేందయ్యా ఇదీ - ఇలాంటోళ్లూ ఉంటారా? - హైదరాబాద్​లో వింత దొంగతనం

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో మొబైల్ దొంగల అరెస్ట్ - రూ.10 లక్షల విలువైన సెల్​ఫోన్లు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details