తెలంగాణ

telangana

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన - ఎన్​ఆర్​ఐ ప్రమేయంతో చిన్నారి మహాన్​కు చికిత్స - NRI HELPS FOR CHILD BRAIN SURGERY

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 2:52 PM IST

NRI Helps For Child's Brain Surgery in Hanamakonda : : 'చిన్నారి మెదడులో గడ్డ కట్టిన రక్తం - ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు' అనే శీర్షికతో ఈటీవీ భారత్ తెలంగాణలో ప్రచురించిన కథనానికి ఓ ఎన్​ఆర్​ఐ స్పందించి శస్త్ర చికిత్స చేయించారు. తన పేరును సైతం బయటకు చెప్పకుండా సాయం చేశారు.

NRI Responded And Child Went to Under Surgery
Child Suffering Blood Clots In Brain in warangal

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన ఎన్​ఆర్​ఐ ప్రమేయంతో చిన్నారి మహాన్​కు చికిత్స

NRI Helps For Child's Brain Surgery in Hanamakonda :ఎన్​ఆర్​ఐ దాతృత్వంతో చిన్నారి మహాన్​కు శస్త్ర చికిత్స జరిగింది. ఈటీవీ భారత్​లో ఇటీవల వచ్చిన కథనాలకు స్పందించిన ఎన్​ఆర్​ఐ ఉదార స్వభావంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుని చిన్నారి ప్రాణాలను కాపాడారు.

హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్, అశ్విత దంపతులకు మూడేళ్ల పాపతో పాటు ఏడాది వయసుగల మహాన్ ఉన్నాడు. బాబు పుట్టిన నెల రోజులకు ప్రారంభమైన మొదలయ్యాయి వారి కష్టాలు. బాబు పుట్టిన నెల రోజులకే అనారోగ్యం పాలవ్వడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు మహాన్‌ మెదడులో రక్తం గడ్డ కట్టిందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు.

వెంకటేష్​, అశ్విత బాబుని తీసుకుని హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మహాన్​ని పరిశీలించిన వైద్యులు ఆపరేషన్​ చేయాలని చెప్పారు. దానికి లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడంతో అప్పులు చేసి మరి మూడు సార్లు శస్త్ర చికిత్స చేయించారు. పూర్తిగా నయం కాకపోవడంతో మరో రెండు ఆపరేషన్లు చేయాలని దానికి సూమారు రూ.6లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.

చిన్నారి మెదడులో గడ్డ కట్టిన రక్తం - ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

NRI Responded And Child Went to Under Surgery : ఈ క్రమంలో మహాన్​పై ఈటీవీ భారత్​లో కథనాలు వచ్చాయి. దీనిపై ప్రవాస భారతీయుడు స్పందించారు. హైదరాబాద్​లో ఉన్న తమ బంధువుల ద్వారా వైద్యులతో మాట్లాడారు. శస్త్ర చికిత్సకు ఎంత ఖర్చయిన భరిస్తామని, బాలుడికి ఆపరేషన్​ చేయాలని ఆసుపత్రిలో కొన్ని డబ్బులు చెల్లించారు. సహాయం చేసిన ఆ వ్యక్తి తన పేరును కూడా వెల్లడించలేదు. దీంతో గురువారం బాలుడికి శస్త్ర చికిత్స చేసి కణితిని తొలగించారు.

మరోవైపు రఘ అరికపూడి సేవా ట్రస్ట్ ఛైర్మన్​ రఘు అరికపూడి రెండు రోజుల నుంచి ఆసుపత్రిలో ఉంటూ బాలుడి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. మరో దాత ఆనగాని రామారావు బాలుడి తండ్రికి రూ.25వేల సాయం అందించారు. ఎన్​ఆర్​ఐ దాతృత్వంతో తమ కుమారుడికి శస్త్రచికిత్స జరిగిందంటూ మహాన్​ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

ఆ ఇంటి పెద్దకు పెద్ద కష్టం.. కావాలి ఆపన్నహస్తం

నిరుపేద కుటుంబం కావడంతో బాబు ఇంకా చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేక వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇప్పటికే లక్షల్లో అప్పులు చేసి చికిత్స చేయించిన తమకు ఏం చేయాలో అర్థం పరిస్థితికి చేరారు. దీంతో ఈటీవీ భారత్​తో తమ కష్టాలను చెప్పుకున్నారు.

'చిన్నారి మెదడులో గడ్డ కట్టిన రక్తం - ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు' అనే శీర్షికతో చిన్నారి పడుతున్న బాధను ఈటీవీ భారత్ కథనంగా ప్రచురించింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చి ఆపరేషన్​ చేయడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కానీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నందున అది కార్యరూపం దాల్చలేదు.

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన - చిన్నారి వైద్యానికి సీఎం రేవంత్ సాయం

ABOUT THE AUTHOR

...view details