MLA Veeresham Fires On BRS Party :గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో అనేక అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ఎమ్మెల్యే వీరేశం ఆరోపించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ తనకు తెలుసని, పార్టీలో అవమానాలకు గురైనందువల్లే కాంగ్రెస్లోకి వచ్చానని తెలిపారు. గత ప్రభుత్వం పాలననో ప్రగతి భవన్ ప్రజలకు దూరమైందని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ గోడలు బద్దలుకొట్టామని చెప్పారు. ప్రజల విశ్వాసాలు, ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం తమదన్నారు. కొన్ని నెలల్లోనే ఈ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో దళితుల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు.
ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం - అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్బాబు ప్రకటన
'దళితుల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం తీసేసింది. దళితబంధు పేరుతో బీఆర్ఎస్ నేతలు దళితులను మభ్యపెట్టారు. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయటపెడతా. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పాలమూరు ప్రజలు బీఆర్ఎస్ను దూరం పెట్టారు. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని బీఆర్ఎస్ నేతలను కోరుతున్నా' అని వీరేశం అన్నారు.
Telangana Assembly Sessions 2024 : కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజన, మైనార్టీ పక్షపాతమని తెలిపారు. గత ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిందని ఆరోపించారు. ఆత్మ గౌరవం, స్వేచ్ఛ కావాలంటూ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, గత పదేళ్లుగా నియంతృత్వ విధానాలతో పరిపాలన కొనసాగిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మిగతా రెండు గ్యారంటీలు త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రియాంకా గాంధీ అంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పదేళ్లుగా జరిగిన అవినీతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వీరేశం అన్నారు.